Vinesh Phogat: స్వదేశానికి విచ్చేసిన భారత స్టార్ రెజ్లర్.. కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్
- స్వదేశానికి చేరుకున్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్
- ఢిల్లీ ఎయిర్పోర్టులో స్వాగతం పలికిన అభిమానులు
- కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vinesh Phogat: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్టులో ఆమెకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వినేష్ ఢిల్లీకి తిరిగి రావడానికి ముందే, భారత రెజ్లర్ అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇప్పటికే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు. రెజ్లర్ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులు ఆమె ఎయిర్పోర్టులో అడుగుపెట్టగానే బిగ్గరగా చీర్స్తో స్వాగతం పలికారు. అభిమానులను చూసిన వినేశ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు వినేష్కు మాజీ రెజ్లర్ సాక్షి మాలిక్, బజరంగ్ పునియా స్వాగతం పలికారు. వారు పారిస్ వినేశ్ను కౌగిలించుకొని అభినందించారు. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్కు చేరిన వినేశ్ ఫోగట్.. 100 గ్రాములు అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన విషయం తెలిసిందే. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)లో అప్పీలు చేసినా వినేశ్ ఫోగట్కు సానుకూలంగా ఫలితం దక్కలేదు. ఆమె విజ్ఞప్తిని కాస్ కొట్టిపడేసింది. కానీ వినేశ్ పారిస్ ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శనను కనబరిచింది.
Read Also: Siddaramaiah: చిక్కుల్లో సిద్ధరామయ్య.. భూకుంభకోణం కేసులో జరగనున్న విచారణ
Also Read
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
జపాన్కు చెందిన గొప్ప ఆధునిక రెజ్లర్లలో ఒకరైన యుయి సుసాకిని ఓడించి, డిఫెండింగ్ ఛాంపియన్గా నిలిచిన తర్వాత అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఒలింపిక్స్లో పతకం సాధించాలనే తన కల చెదిరిపోయిన తర్వాత వినేశ్ రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే.. తాజాగా వినేశ్ ఫోగట్ తన రిటైర్మెంట్ పై శుభవార్త చెప్పింది. తన ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, శుక్రవారం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. రెజ్లింగ్లో పునరాగమనం చేయబోతున్నట్లు ఒక హింట్ ఇచ్చింది. 2032 వరకు ఆడాలనుకున్నట్లు వినేశ్ చెప్పింది. వినేష్ తన సోషల్ మీడియా పోస్ట్లో “నా టీమ్కి, నా తోటి భారతీయులకు మరియు నా కుటుంబానికి, మేము పని చేస్తున్న, సాధించాలనుకున్న లక్ష్యం అసంపూర్తిగా మిగిలిపోయినట్లు అనిపిస్తుంది. ఎప్పుటికీ ఇలా జరగదు. అన్ని విషయాలు ఎప్పుడు ఒకేలా ఉండకపోవచ్చు. నేను 2032 వరకు ఆడగలుగుతాను, నాలో పోరాటం, కుస్తీ ఎప్పుడూ ఉంటుంది.” అని పోస్ట్ లో పేర్కొంది.
తాజావార్తలు
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!