Vinesh Phogat: స్వదేశానికి విచ్చేసిన భారత స్టార్ రెజ్లర్.. కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్
- స్వదేశానికి చేరుకున్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్
- ఢిల్లీ ఎయిర్పోర్టులో స్వాగతం పలికిన అభిమానులు
- కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vinesh Phogat: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్టులో ఆమెకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వినేష్ ఢిల్లీకి తిరిగి రావడానికి ముందే, భారత రెజ్లర్ అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇప్పటికే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు. రెజ్లర్ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులు ఆమె ఎయిర్పోర్టులో అడుగుపెట్టగానే బిగ్గరగా చీర్స్తో స్వాగతం పలికారు. అభిమానులను చూసిన వినేశ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు వినేష్కు మాజీ రెజ్లర్ సాక్షి మాలిక్, బజరంగ్ పునియా స్వాగతం పలికారు. వారు పారిస్ వినేశ్ను కౌగిలించుకొని అభినందించారు. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్కు చేరిన వినేశ్ ఫోగట్.. 100 గ్రాములు అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన విషయం తెలిసిందే. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)లో అప్పీలు చేసినా వినేశ్ ఫోగట్కు సానుకూలంగా ఫలితం దక్కలేదు. ఆమె విజ్ఞప్తిని కాస్ కొట్టిపడేసింది. కానీ వినేశ్ పారిస్ ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శనను కనబరిచింది.
Read Also: Siddaramaiah: చిక్కుల్లో సిద్ధరామయ్య.. భూకుంభకోణం కేసులో జరగనున్న విచారణ
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
జపాన్కు చెందిన గొప్ప ఆధునిక రెజ్లర్లలో ఒకరైన యుయి సుసాకిని ఓడించి, డిఫెండింగ్ ఛాంపియన్గా నిలిచిన తర్వాత అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఒలింపిక్స్లో పతకం సాధించాలనే తన కల చెదిరిపోయిన తర్వాత వినేశ్ రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే.. తాజాగా వినేశ్ ఫోగట్ తన రిటైర్మెంట్ పై శుభవార్త చెప్పింది. తన ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, శుక్రవారం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. రెజ్లింగ్లో పునరాగమనం చేయబోతున్నట్లు ఒక హింట్ ఇచ్చింది. 2032 వరకు ఆడాలనుకున్నట్లు వినేశ్ చెప్పింది. వినేష్ తన సోషల్ మీడియా పోస్ట్లో “నా టీమ్కి, నా తోటి భారతీయులకు మరియు నా కుటుంబానికి, మేము పని చేస్తున్న, సాధించాలనుకున్న లక్ష్యం అసంపూర్తిగా మిగిలిపోయినట్లు అనిపిస్తుంది. ఎప్పుటికీ ఇలా జరగదు. అన్ని విషయాలు ఎప్పుడు ఒకేలా ఉండకపోవచ్చు. నేను 2032 వరకు ఆడగలుగుతాను, నాలో పోరాటం, కుస్తీ ఎప్పుడూ ఉంటుంది.” అని పోస్ట్ లో పేర్కొంది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..