NTV Telugu Site icon

Vimalamma: అక్కాచెల్లెళ్లు నోరు మూసుకోండి.. వైఎస్‌ ఫ్యామిలీ పరువు తీస్తున్నారు..!

Vimalamma

Vimalamma

Vimalamma: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో వైఎస్‌ ఫ్యామిలీలోనే కొందరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు.. ముఖ్యంగా ఎంపీ అవినాష్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తున్నారు వైఎస్‌ షర్మిల, వైఎస్ సునీత.. అయితే, వారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మేనత విమలమ్మ.. అక్కాచెల్లెళ్లు నోరు మూసుకోండి.. వైఎస్‌ ఫ్యామిలీ పరువును బజారుకు ఈడుస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వైఎస్‌ కుటుంబంలోని ఆడపడుచులు అన్యాయంగా మాట్లాడుతారా? వైఎస్ కుటుంబ పరువును రోడ్డు మీదకు తీసుకువస్తున్నారు అంటూ విరుచుకుపడ్డ ఆమె.. నేను కూడా ఆ ఇంటి ఆడపడుచుగా ఇప్పుడు మాట్లాడుతున్నాను.. వైఎస్‌ అవినాష్ రెడ్డి హత్య చేస్తుంటే ఈ ఇద్దరు ఆడపిల్లలు చూసారా ? అని నిలదీశారు.

Read Also: Rishabh Pant: పంత్ పై మండి పడ్డ ఆడం గిల్‌క్రిస్ట్‌.. అసలు మ్యాటరేంటంటే..?!

వైఎస్ వివేకాను చంపినవాళ్లు బయట తిరుగుతున్నాకరంర విమలమ్మ.. మా ఇంట్లో పాపలు ఇలా తయారు అయ్యారని బాధగా ఉందన్నారు. చివరకు వైఎస్‌ జగన్ ను కూడా దీంట్లోకి తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. షర్మిల, సునీత వ్యక్తిగతంగా కక్ష్య పెట్టుకున్నారు.. ఇప్పటికీ అయినా ఇద్దరు అక్కాచెల్లెళ్లు నోరు ముసుకోండి అని సూచించారు. మీకు కరుణ , జాలి లేదా? అని మండిపడ్డారు. వైఎస్‌ కుటుంబ సభ్యులు ఎవ్వరూ మీకు మద్దతు ఇవ్వరు గుర్తు పెట్టుకోండి అని హెచ్చరించారు. జగన్ శత్రువులు అంతా షర్మిల చుట్టూ చేరారని దుయ్యబట్టారు. ఇక, ఎంపీ అవినాష్ రెడ్డి కడపను అభివృద్ధి చేశారు.. అవినాష్ రెడ్డి ఒక్క మాట ఇప్పటి వరకు ఆ ఇద్దరినీ అనలేదన్నారు. వాళ్ల కోసం ప్రార్థన చేస్తున్నా.. ఇద్దరు నాశనం అవుతారు.. మీకు దైవ భయం పోయిందన్నారు. ఇక, ఆస్తులు ఈడీ నుంచి రిలీజ్ అయిన తర్వాత ఇస్తానని షర్మిలకు వైఎస్‌ జగన్‌ చెప్పారని తెలిపారు వైఎస్‌ జగన్‌ మేనత విమలమ్మ. ఇంకా ఆమె ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..