Vikram Misri: విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ..
- దేశ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా కొనసాగుతున్న విక్రమ్
- జూలై 14 వరకు విదేశాంగ కార్యదర్శి కొనసాగనున్న వినయ్ క్వాత్రా
- జులై 15న బాధ్యతలు చేపట్టనున్న విక్రమ్ మిస్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత విదేశాంగ కార్యదర్శిగా.. దేశ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (డిప్యూటీ ఎన్ఎస్ఏ) విక్రమ్ మిస్రీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. జూలై 15న విక్రమ్ మిస్రీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నియామక ఉత్తర్వుల్లో పేర్కొంది. విక్రమ్ మిస్రీ 1989 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి. ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న వినయ్ క్వాట్రా (Vinay Kwatra) పదవీకాలం 2024 ఏప్రిల్ 30తో ముగిసింది. ఆయన పదవీకాలాన్ని ఏప్రిల్ 30 నుంచి జూలై 14 వరకు పొడిగిస్తూ కేంద్రం 2024 మార్చి 12 ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల మేరకు ఆయన జూలై 14 వరకు విదేశాంగ కార్యదర్శిగా కొనసాగుతారు. అనంతరం విక్రమ్ మిస్రీ బాధ్యతలు స్వీకరిస్తారు.
READ MORE: Pune Video: ఎయిరిండియా విమానం రద్దు.. ప్రయాణికుల ఆగ్రహం
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
విక్రమ్ మిస్రీ డిసెంబర్ 2021లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. అతను ఫారిన్ సర్వీస్ అధికారి మరియు డిసెంబర్ 11 వరకు చైనాలో రాయబారిగా పనిచేశాడు. ఆయన నుంచి ప్రదీప్ కుమార్ రావత్ బాధ్యతలు స్వీకరించారు.
READ MORE:Rahul Gandhi: ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా మైక్ కట్.. ఎక్స్లో వీడియో షేర్
విక్రమ్ మిస్రీ 7 నవంబర్ 1964న శ్రీనగర్లో జన్మించారు. అతను ఢిల్లీలోని హిందూ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు.అతను ఎంబీఏ కూడా పూర్తి చేశారు. సివిల్ సర్వీసెస్లో చేరడానికి ముందు, అతను మూడు సంవత్సరాలు అడ్వర్టైజింగ్.. యాడ్ ఫిల్మ్ ప్రొడక్షన్లో పనిచేశారు. అతను ఇంగ్లీష్, హిందీ మరియు కాశ్మీరీ భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు మరియు ఫ్రెంచ్ భాషలో కూడా పరిజ్ఞానం కలిగి ఉన్నాడు. విక్రమ్ మిస్రీ డిసెంబర్ 2021లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. అతను ఫారిన్ సర్వీస్ అధికారి, డిసెంబర్ 11 వరకు చైనాలో రాయబారిగా పనిచేశారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?