Kesineni Nani: చంద్రబాబు ఇచ్చే హామీలు బీజేపీ కూడా నమ్మట్లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kesineni Nani: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతలు ప్రచార జోరును పెంచారు. విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేశినేని నాని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. మొదట విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి కేశినేని నాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒక మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా కేశినేని నాని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అని ప్రజలందరూ చెబుతున్న పరిస్థితి ఉందన్నారు. బీజేపీతో సంబంధం లేకుండా మేనిఫెస్టో రిలీజ్ చేశారు.. చంద్రబాబు ఇచ్చే హామీలు బీజేపీ కూడా నమ్మట్లేదని విమర్శించారు. అందుకనే మేనిఫెస్టో నుంచి వాళ్ళ సింబల్, వాళ్ల ఫోటోలు పార్టీ పేరు లేకుండా మేనిఫెస్టో డిలీట్ చేశారన్నారు. కూటమిలో ముఖ్య భాగస్వామి చంద్రబాబు నాయుడిని నమ్మడం లేదు ఇంక ప్రజలేం నమ్ముతారు అని అందరూ అనుకుంటున్నారన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. వైయస్ఆర్సీపీ బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ గెలవబోతోందని కేశినేని నాని స్పష్టం చేశారు.
వైసీపీలోకి చేరికలు
అనంతరం జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి సామనేని ఉదయభానుతో కలిసి కేశినేని నాని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేటలో కేశినేని శ్రీనివాసరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ 29వ వార్డు కౌన్సిలర్ షేక్ సిరాజున్, ఆమె భర్త మార్కెట్ యార్డ్ మాజీ వైస్ ఛైర్మన్ సీనియర్ తెదేపా నేత షేక్ సత్తార్, పెద్ద ఎత్తున ముస్లింలు వైసీపీలో చేరారు. వారిని ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభాను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత జగ్గయ్యపేట మండలం గౌరవరం, బండిపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు మే 13 దాకా కష్టపడి పని చేయాలని కేశినేని సూచించారు. వైసీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఐదు సంవత్సరాలు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని.. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి పథకాలు పేద ప్రజల కోసం అమలు చేయలేదన్నారు. మరల అన్ని పథకాలు అందాలన్నా, సంక్షేమ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కావాలన్నా ప్రతి ఒక్కరు వైసీపీని గెలిపించాలని కేశినేని నాని కోరారు.
Also Read
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
తాజావార్తలు
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!