Vijayawada: టెర్రర్ లింకుల కేసులో ఇద్దరు అరెస్ట్.. వెలుగులోకి కొత్త నిజాలు.!
- విజయవాడ టెర్రర్ లింకుల కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్
- అబ్దుల్ సలాం (A11), సైదా బేగం (A5) అరెస్ట్
- కోర్టు ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధింపు
- ఇప్పటికే మరో ముగ్గురు నిందితులు జైలుకు పంపింపు
- కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: విజయవాడలో టెర్రర్ లింకుల కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం వారికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో A11 అబ్దుల్ సలాం, A5 సైదా బేగంను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
Actor Rajasekhar: డాన్స్ రాదని ఒప్పుకున్న రాజశేఖర్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
Also Read
- Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
- Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
- Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. ఈ 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
- Heinrich Klaasen IPL Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హెన్రిచ్ క్లాసెన్.. ఆ రికార్డులు బద్దలు
కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు విచారణను మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిందితుల బ్యాంక్ ఖాతాల లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీనికోసం సంబంధిత బ్యాంకులను సంప్రదించి, పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. అలాగే నిందితులు ఉపయోగించిన మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఫోన్లలో ఉన్న కాల్ డేటా, మెసేజింగ్ వివరాలను విశ్లేషిస్తూ, మరిన్ని లింకులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. నిందితులు పట్టుబడిన ఇంట్లో ఉగ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించే పుస్తకాలు, లిటరేచర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న సైదా బేగం గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ సైదాబాద్ కు చెందిన ఆమె, ఏడాది క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. పోలీసుల విచారణలో సైదా బేగం 42 మందితో ఒక టెర్రర్ గ్రూప్ ఏర్పాటు చేసి, సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి సంబంధించిన పోస్టింగ్లు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ కార్యకలాపాలు ఎక్కువగా సాగినట్లు గుర్తించారు. సైదా బేగం విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ, వారి సూచనల మేరకు టెర్రర్ కంటెంట్ ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా యువతను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.
YS Jagan: జగన్ 2.0లో మహిళలకు, కార్యకర్తలకు పెద్దపీట.. నేతలతో జగన్ భేటీ..!
అంతేకాదు, యువతను రాడికలైజ్ చేసి ఉగ్రవాద దిశగా మళ్లించే ప్రయత్నాలు జరిగినట్లు విచారణలో తేలింది. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రభావం పెరుగుతుండటంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో నిందితులను మరింతగా విచారించేందుకు పోలీసులు కోర్టులో వారం రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
తాజావార్తలు
-
Lenin: “మనోడు వస్తున్నాడు”.. ‘లెనిన్’ టీజర్ వైరల్..
-
Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
-
China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
-
Nagarjuna: “మనం” నా జీవితంలో మరచిపోలేని సినిమా.. నాగార్జున ఎమోషనల్
-
Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!