Vijayawada: టెర్రర్ లింకుల కేసులో ఇద్దరు అరెస్ట్.. వెలుగులోకి కొత్త నిజాలు.!
- విజయవాడ టెర్రర్ లింకుల కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్
- అబ్దుల్ సలాం (A11), సైదా బేగం (A5) అరెస్ట్
- కోర్టు ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధింపు
- ఇప్పటికే మరో ముగ్గురు నిందితులు జైలుకు పంపింపు
- కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: విజయవాడలో టెర్రర్ లింకుల కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం వారికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో A11 అబ్దుల్ సలాం, A5 సైదా బేగంను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
Actor Rajasekhar: డాన్స్ రాదని ఒప్పుకున్న రాజశేఖర్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
Also Read
- Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్పై ట్రంప్ సంచలన ఆరోపణలు
- US-Iran: జెనీవా వేదికగా ఇరాన్-యూఎస్ శాంతి ఒప్పందం! ఎప్పుడంటే..!
- Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు విచారణను మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిందితుల బ్యాంక్ ఖాతాల లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీనికోసం సంబంధిత బ్యాంకులను సంప్రదించి, పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. అలాగే నిందితులు ఉపయోగించిన మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఫోన్లలో ఉన్న కాల్ డేటా, మెసేజింగ్ వివరాలను విశ్లేషిస్తూ, మరిన్ని లింకులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. నిందితులు పట్టుబడిన ఇంట్లో ఉగ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించే పుస్తకాలు, లిటరేచర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న సైదా బేగం గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ సైదాబాద్ కు చెందిన ఆమె, ఏడాది క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. పోలీసుల విచారణలో సైదా బేగం 42 మందితో ఒక టెర్రర్ గ్రూప్ ఏర్పాటు చేసి, సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి సంబంధించిన పోస్టింగ్లు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ కార్యకలాపాలు ఎక్కువగా సాగినట్లు గుర్తించారు. సైదా బేగం విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ, వారి సూచనల మేరకు టెర్రర్ కంటెంట్ ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా యువతను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.
YS Jagan: జగన్ 2.0లో మహిళలకు, కార్యకర్తలకు పెద్దపీట.. నేతలతో జగన్ భేటీ..!
అంతేకాదు, యువతను రాడికలైజ్ చేసి ఉగ్రవాద దిశగా మళ్లించే ప్రయత్నాలు జరిగినట్లు విచారణలో తేలింది. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రభావం పెరుగుతుండటంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో నిందితులను మరింతగా విచారించేందుకు పోలీసులు కోర్టులో వారం రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
తాజావార్తలు
-
Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్పై ట్రంప్ సంచలన ఆరోపణలు
-
US-Iran: జెనీవా వేదికగా ఇరాన్-యూఎస్ శాంతి ఒప్పందం! ఎప్పుడంటే..!
-
Ragi Semiya Puttu: రాగులతో ఇలాంటి స్నాక్ ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ అద్భుతం, ఆరోగ్యం గ్యారెంటీ!
-
Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
-
Rao Bahadur Teaser: లాస్ట్లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!