Vijayawada: ఉచిత దర్శనం భక్తులకు ప్రత్యేకంగా ‘అంతరాలయ దర్శనం’.. విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: విజయవాడ ఇంద్రకిలాద్రిలో భక్తుల సౌకర్యం కోసం కనకదుర్గమ్మ దేవస్థానం ఒక వినూత్నమైన ప్రయోగాన్ని చేపట్టింది. సర్వదర్శనం (ఉచిత దర్శనం) క్యూలో వచ్చే భక్తులకు కూడా ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించే దిశగా ఈరోజు మధ్యాహ్నం ప్రత్యేక ట్రయల్ రన్ నిర్వహించారు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ప్రయోగాత్మక కార్యక్రమం సాగింది.
New Districts In AP: మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లకూ గ్రీన్ సిగ్నల్..!
Also Read
- కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
- Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క 'సెల్ఫీ వీడియో'తో అకౌంట్ రికవర్!
- Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
- Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
ఈ సందర్భంగా ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులను ప్రత్యేకంగా అంతరాలయ దర్శనం లైన్లోకి మెర్జ్ చేయడం ద్వారా ఒక్కసారిగా అమ్మవారి అంతరాలయంలోనుంచి దర్శనం పొందే అవకాశం ఇవ్వబడింది. ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ స్వయంగా వచ్చి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా దర్శనం కొనసాగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
IP68+IP69 డ్యూయల్ ప్రొటెక్షన్, 20GB RAM, టాప్-నాచ్ స్పెసిఫికేషన్లతో Huawei Mate 80 Series లాంచ్..!
మొత్తం ఒక గంటలో 1500 మందికి పైగా భక్తులు ఉచిత దర్శనం క్యూలైన్ నుంచే నేరుగా అంతరాలయ దర్శనం సౌకర్యం పొందారు. సాధారణంగా ఇలాంటి అవకాశం కేవలం ప్రత్యేక దర్శనం లేదా టికెట్ ధారులకు మాత్రమే లభిస్తుండగా.. ఉచిత దర్శనం భక్తులకు ఆకస్మికంగా ఇదొక ప్రత్యేక అనుభూతి కలిగింది. ఈ అవకాశాన్ని అందించినందుకు భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంపై చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ మాట్లాడుతూ.. ఉచిత దర్శనం క్యూలైన్ భక్తులకు కొద్దిసేపు అంతరాలయ దర్శనం సౌకర్యం కల్పించడంపై ఇవాళ ప్రయోగాత్మకంగా పరిశీలించామని, ఫలితాలను ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి, దేవదాయ శాఖ మంత్రి, కమిషనర్ ఆమోదంతో ముందుకు సాగనున్నట్లు తెలిపారు. భక్తుల సౌలభ్యం కోసం తీసుకున్న ఈ నిర్ణయం విజయవంతంగా నిలవడంతో ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్లో అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధం!
-
Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క ‘సెల్ఫీ వీడియో’తో అకౌంట్ రికవర్!
-
Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
-
Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
ట్రెండింగ్
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!