Budameru: వేగంగా బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు.. ఆర్మీ సాయంతో ముమ్మరం
- బుడమేరు గండ్లు ఇవాళ పూడ్చేయాలని టార్గెట్ పెట్టుకున్న ప్రభుత్వం
- ఆర్మీ సాయంతో మూడో గండి పూడ్చివేత పనులు ముమ్మరం
- గాబియన్ బాస్కెట్ విధానంలో పనులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budameru: బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నాయి. బుడమేరు గండ్లను ఇవాళ పూడ్చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఆర్మీ సాయంతో మూడో గండి పూడ్చివేత పనులను అధికారం ముమ్మరం చేశారు. గాబీయన్ బాస్కెట్ విధానంలో పనులు జరుగుతున్నాయి. ఇనుప జాలీల్లో రాళ్ళను నింపి గండి పూడ్చివేతకు పనులు జరుగుతున్నాయి. ఒక్కొక్కటి 522 మీటర్ల పరిమాణం గల గాబియన్ బాస్కెట్లను తొలుత ఒకదానిపై ఒకటి పేర్చి వాటిల్లో నింపి గండికి అడ్డుకట్టగా వేయనుంది. 100 మీటర్లు ఉన్న మూడో గండిలో 40 మీటర్లు నిన్ననే అధికారులు పూడ్చారు. ఇవాళ మిగతా 60 మీటర్లు పూడ్చటమే టార్గెట్గా పనులు జరుగుతున్నాయి. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో గండిని పూడ్చే పనులను ఒకవైపు ఏజెన్సీలు చేస్తుంటే మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పనులు చేస్తున్నారు. చెన్నైకి చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది ఇక్కడికి వచ్చారు.
Read Also: Bandi Sanjay: తెలంగాణను అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రయత్నిస్తాం..
Also Read
- Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
- Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
ఇదిలా ఉండగా.. బుడమేరు మూడో గండి 90 శాతం పూర్తి అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఇంకో రెండు గంటల్లో చంద్రబాబు కృషి ఫలించి బుడమేరు గండ్లు పూడిక పూర్తి అవుతుందని ఆయన వెల్లడించారు. మిగిలిన 10శాతం ఇంకో రెండు గంటల్లో పూర్తి చేసి సింగ్ నగర్ నుండి విజయవాడ వెళ్ళే వరదను పూర్తిగా నివారిస్తామన్నారు. నేటితో బుడమేరు వరద నుండి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని మంత్రి తెలిపారు. విపత్తుతో వేలాది మంది పడుతున్న కష్టంతో పోల్చితే మాకష్టం ఎంత అంటూ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు.
కాగా, విజయవాడలో బుడమేరు వరద తగ్గుముఖం పట్టింది. బురద పట్టిన ఇళ్ళను ప్రజలు పరిశుభ్రం చేసుకుంటున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచీ ఇంటింటికీ వాహనాల ద్వారా నిత్యావసరాల పంపిణీ జరుగుతోంది.
తాజావార్తలు
-
Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
-
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!