Sankranti Celebrations: విజయవాడ ఏ.ఆర్. పోలీసు గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలు..
- విజయవాడ ఏ.ఆర్. పోలీసు గ్రౌండ్ లో సంక్రాంతి సంబరాలు
- ముత్యాల ముగ్గులతో తమలో కళా నైపుణ్యాన్ని ప్రదర్శించిన మహిళా పోలీసు సిబ్బంది
- భోగి మంటలతో సంక్రాంతి వేడుకలను ప్రారంభించిన పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ ఏ.ఆర్. పోలీసు గ్రౌండ్ లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ముత్యాల ముగ్గులతో తమలో కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు మహిళా పోలీసు సిబ్బంది. భోగి మంటలతో సంక్రాంతి వేడుకలను ప్రారంభించిన పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ.. హెల్మెట్ వాడకం పై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రజల్లో కూడా చాలా మంచి అవగాహన వచ్చిందన్నారు. మీడియా కథనాలు కూడా ప్రజల్లో చైతన్యం తెచ్చింది.. హెల్మెట్ లేక పోవడం వల్లే నిన్న ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయారు.. సంక్రాంతి పండుగ నుంచి అయినా అందరూ పూర్తిగా హెల్మెట్ లు వాడాలని కోరారు. భవిష్యత్తులో ట్రిపుల్ రైడింగ్ పై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించాలనేది తమ లక్ష్యమని పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు అన్నారు.
Read Also: APCOB: డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా?.. ఏపీ-కో-ఆపరేటివ్ బ్యాంక్ లో జాబ్స్ రెడీ.. నెలకు రూ. 57 వేల జీతం
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
మీ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని నిబంధనలు పాటించండి.. డ్రోన్ ద్వారా కూడా ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తామని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. పోలీసు సిబ్బంది కూడా హెల్మెట్ వాడాలని చెప్పాం.. ఎవరైనా వాడకపోతే వారి పై చర్యలు ఉంటాయన్నారు. మీడియా సభ్యులు కూడా బాధ్యతతో హెల్మెట్ లు వాడాలని విజ్ఞప్తి చేశామన్నారు. సంక్రాంతి రద్దీ నేపధ్యంలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరణ చేస్తున్నామని తెలిపారు. పండుగ పేరుతో బెట్టింగ్ లు, కోడి పందాలు ఆడకండని సూచించారు. చాలా చోట్లా కోడి పందాల బరులు పూర్తిగా తొలగించాం.. మరో రెండు రోజులు డ్రైవ్ పెట్టి బరులు తొలగిస్తామని అన్నారు. సంక్రాంతిని సరదాగా జరుపుకోండి… ఆహ్లాదకరంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించండని సీపీ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు.
Read Also: Tusli Leave : చలికాలంలో ప్రతిరోజూ తులసి ఆకులను తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..