Kamalnath: భారత్ జోడో యాత్రతో చచ్చిపోతున్నాం.. మాజీ ముఖ్యమంత్రి వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamalnath: కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు అగ్రనేత రాహుల్గాంధీ నేతృత్వంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది. ఈ యాత్రలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ సహా పలువురు రాష్ట్ర నేతలు యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో భారత్ జోడ్ యాత్ర కఠిన షెడ్యూల్పై అసహనం ప్రదర్శిస్తున్న కమల్నాథ్కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. జోడో యాత్రపై కమల్నాథ్ అసహనం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ‘గత వారం రోజులుగా మేం చచ్చిపోతున్నాం’’ అని ఆయన అన్నట్లుగా వీడియో ఉంది. దీంతో ఇది కాస్తా కాంగ్రెస్ పార్టీని కొత్త ఇబ్బందుల్లో పడేసినట్లు తెలుస్తోంది.
ఈ వీడియో ప్రకారం.. ప్రదీప్ మిశ్రా అనే పండింతుడితో కమల్నాథ్ మాట్లాడుతున్నారు. ‘‘గత ఏడు రోజులుగా మేం చచ్చిపోతున్నాం. దాంట్లో రెండు నిబంధనలుంటాయి. రోజూ ఉదయం 6 గంటలకే యాత్ర ప్రారంభించాలి. రోజుకు కనీసం 24 కిలోమీటర్లు నడవాలి’’ అని మాజీ ముఖ్యమంత్రి చెబుతున్నారు. అంతేగాక, మధ్యప్రదేశ్లో యాత్ర కోసం రాహుల్ మూడు ప్రీ కండిషన్లు పెట్టారని కమల్నాథ్ అన్నారు. ఆదివాసీ వీరుడు తాంత్య భిల్ జన్మస్థలం, ఓంకారేశ్వర, మహంకాళీ ఆలయాలను సందర్శించాలని రాహుల్ షరతు పెట్టారని ఆయన చెప్పారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- MS Dhoni: “మిస్టర్ కూల్”కి అంత కోపం వచ్చిందా.. మ్యాచ్ ఓడిపోవడంతో టీవీ పగలగొట్టాడా.?
- Sunglasses Safety Tips: మీ సన్గ్లాసెస్ అసలైనవేనా? నకిలీదా..? కేవలం 2 సెకన్లలో చెక్ చేయండి.. లేదంటే కళ్లకు ప్రమాదమే!
- Jessica Head: అబ్బె.. ఏం చిల్లరగాళ్లు ఉన్నారా మీరు.! కోహ్లితో వాగ్వాదం.. ట్రావిస్ హెడ్ భార్యకు ఆన్లైన్ వేధింపుల సెగ..
Gujarat Elections: గుజరాత్లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 56.88 శాతం ఓటింగ్ నమోదు
ఇందుకు సంబంధించిన వీడియోను కొన్ని స్థానిక మీడియా సంస్థలు సోషల్మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. కాగా.. మధ్యప్రదేశ్ జోడో యాత్రలో కమల్నాథ్.. రాహుల్ వెంటే ఉన్నారు. రాహుల్తో కలిసి ఓంకారేశ్వర, ఉజ్జయిని మహంకాళీ ఆలయాలను దర్శించుకున్నారు. ఈ వీడియో వైరల్ కావటంతో కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు బీజేపీ మంత్రి నరోత్తమ్ మిశ్రా. ‘కమల్నాథ్ జీ.. మీ వీడియో చూశాను. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. శారీరకంగా బలహీనంగా ఉన్నవారిని యాత్రలో పాల్గొనేలా రాహుల్ బలవంతపెట్టొద్దని ప్రార్థిస్తున్నా. మీ యాత్ర ఎవరికీ హాని కలగకుండా చూసుకోండి’అని విమర్శించారు.
Bharat Jodo Yatra: कमल नाथ का वीडियो वायरल, बोले- हम तो सात दिन से मर रहे हैं https://t.co/UChv8Xf1mL#KamalNath #BharatJodoYatra #MadhyaPradesh #Naidunia pic.twitter.com/mOX1m9SZrR
— NaiDunia (@Nai_Dunia) December 1, 2022
తాజావార్తలు
-
Tollywood : టాలీవుడ్ ‘ఫ్లాప్’ బ్యూటీస్కు కోలీవుడ్ రెడ్ కార్పెట్!
-
Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
-
Kollywood: నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరు?
-
MS Dhoni: “మిస్టర్ కూల్”కి అంత కోపం వచ్చిందా.. మ్యాచ్ ఓడిపోవడంతో టీవీ పగలగొట్టాడా.?
-
Jasprit Bumrah: డాన్ బ్రాడ్మన్కు రివర్స్.. బుమ్రా పేరిట అత్యంత చెత్త ప్రపంచ రికార్డు!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!