Tirupati: విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు..డీఎస్పీ మనోహరాచ్చారి స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమస్యాత్మక వార్డుల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి డీఎస్పీ మనోహరాచ్చారి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రౌడీ షీటర్స్ పై నిఘా పెంచామని చెప్పారు. టపాసులు అమ్మడం, కొనడం నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని స్పష్టం చేశారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఇవ్వమని.. ఒక వేళ ఎవరైనా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ జూన్ 6వ తేది వరకు అమలులో ఉంటుందని తెలిపారు. జూన్ 1 వ తేదీ నుంచి 5వ తేది వరకు తిరుపతిలో భయటి వ్యక్తులకు రూమ్స్ పై నిషేధం విధించినట్లు చెప్పారు. భక్తులకు తప్ప మిగిలిన వారికి లాడ్జి ఓనర్స్, కళ్యాణమండపాల యజమానులు రూమ్స్ ఇవ్వకూడదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు శాంతి భద్రతలకి విఘాతం కల్పించకుండా సహకరించాలని కోరారు. జూన్ 4వ తేది కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులు కవ్వింపు చర్యల దిగితే కేసులు తప్పవని మరోసారి హెచ్చరించారు.
READ MORE: Dinesh Karthik-Virat Kohli: థ్యాంక్యూ డీకే.. ఎప్పటికీ నీకు రుణపడి ఉంటా: కోహ్లీ
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
కాగా.. తిరుపతిలో ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్ వరకు గొడవలు చెలరేగుతూనే ఉన్నాయి. ప్రధాన పార్టీల మధ్య ఘర్షణ తారా స్థాయికి చేరుకుంది. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు ఇరు పార్టీల అభ్యర్థులు ఒకరి తర్వాత ఒకరు రావడంతో తిరుపతిలోని రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీఓ) కార్యాలయం ఎదుట అధికార వైఎస్ఆర్సీ, ప్రతిపక్ష టీడీపీ శ్రేణులు ఘర్షణకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అప్పటి నుంచి పోలింగ్ అయిపోయాక కూడా ఘర్షణ కొనసాగింది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!