Tirupati: విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు..డీఎస్పీ మనోహరాచ్చారి స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమస్యాత్మక వార్డుల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి డీఎస్పీ మనోహరాచ్చారి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రౌడీ షీటర్స్ పై నిఘా పెంచామని చెప్పారు. టపాసులు అమ్మడం, కొనడం నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని స్పష్టం చేశారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఇవ్వమని.. ఒక వేళ ఎవరైనా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ జూన్ 6వ తేది వరకు అమలులో ఉంటుందని తెలిపారు. జూన్ 1 వ తేదీ నుంచి 5వ తేది వరకు తిరుపతిలో భయటి వ్యక్తులకు రూమ్స్ పై నిషేధం విధించినట్లు చెప్పారు. భక్తులకు తప్ప మిగిలిన వారికి లాడ్జి ఓనర్స్, కళ్యాణమండపాల యజమానులు రూమ్స్ ఇవ్వకూడదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు శాంతి భద్రతలకి విఘాతం కల్పించకుండా సహకరించాలని కోరారు. జూన్ 4వ తేది కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులు కవ్వింపు చర్యల దిగితే కేసులు తప్పవని మరోసారి హెచ్చరించారు.
READ MORE: Dinesh Karthik-Virat Kohli: థ్యాంక్యూ డీకే.. ఎప్పటికీ నీకు రుణపడి ఉంటా: కోహ్లీ
Also Read
కాగా.. తిరుపతిలో ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్ వరకు గొడవలు చెలరేగుతూనే ఉన్నాయి. ప్రధాన పార్టీల మధ్య ఘర్షణ తారా స్థాయికి చేరుకుంది. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు ఇరు పార్టీల అభ్యర్థులు ఒకరి తర్వాత ఒకరు రావడంతో తిరుపతిలోని రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీఓ) కార్యాలయం ఎదుట అధికార వైఎస్ఆర్సీ, ప్రతిపక్ష టీడీపీ శ్రేణులు ఘర్షణకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అప్పటి నుంచి పోలింగ్ అయిపోయాక కూడా ఘర్షణ కొనసాగింది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!