Venkatesh Iyer gets engaged with Shruti Raghunathan: టీమిండియా యువ క్రికెటర్, కోల్కతా నైట్రైడర్స్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శృతి రఘునాథన్ను అయ్యర్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. మంగళవారం అయ్యర్, శృతిల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయ్యర్ పోస్ట్ చూసిన భారత క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్, మన్దీప్ సింగ్ సహా పలువురు సెలబ్రిటీలు అతడికి శుభాకాంక్షలు తెలిపారు.
ఐపీఎల్తో వెంకటేశ్ అయ్యర్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 2021 సీజన్లో అయ్యర్ రెచ్చిపోయి ఆడాడు. 10 మ్యాచుల్లో 41.11 సగటుతో 370 పరుగులు చేసి బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇప్పటివరకు భారత జట్టు తరఫున 9 టీ20లు, 2 వన్డేలు ఆడాడు. ఈ అవకాశాల్ని అతడు సద్వినియోగం చేసుకోలేదు. దాంతో అయ్యర్ టీమిండియాకు దూరమయ్యాడు. చివరగా గత ఏడాది ఫిబ్రవరిలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.
Also Read: Sanju Samson: సంజూ.. నెదర్లాండ్స్ లేదా ఐర్లాండ్ తరఫున ఆడు! 2027 ప్రపంచకప్లో ఆడుతావ్
2023 మినీ వేలంలో రూ. 8 కోట్ల భారీ ధరకు వెంకటేశ్ అయ్యర్ను కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసింది. ఈ సీజన్లో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో 14 మ్యాచుల్లో 404 పరుగులు చేశాడు. 2024 ఐపీఎల్ వేలంలో కోల్కతా జట్టు అయ్యర్ను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 19న బీసీసీఐ ఐపీఎల్ వేలం నిర్వహించనుంది. ఇక ఫ్యాషన్ డిజైనింగ్లో మాస్టర్స్ చేసిన శృతి రఘునాథన్.. బెంగళూరులోని ఓ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో పనిచేస్తోన్నట్లు సమాచారం.