Venkaiah Naidu: నిజాయితీగా పని చేస్తే దేశం అభివృద్ది చెందుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు ప్రభుత్వ కళాశాల స్నాతకోత్సవంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యశాల..మెడికల్ కాలేజీగా అభివృద్ధి చెందటం సంతోషం కలిగిస్తోంది అని పేర్కొన్నారు. మా అమ్మాయి దీపావెంకట్ కూడా ఇదే ఆసుపత్రిలో జన్మించింది.. పౌరులు నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా పనిచేస్తే దేశం అభివృద్ది చెందుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయ, వైద్య వృత్తిలో ఉన్నవారంతా అంకితభావంతో సేవలు అందించాలి.. రాజ్యాంగ నిర్మాతలు కూడా అదే కోరుకున్నారు.. ఏ దేశమైనా శక్తివంతంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పారు. దేశ ప్రజల్లో 60 శాతం మంది గ్రామాల్లో ఉన్నారు.. వైద్యులందరూ గ్రామీణ ప్రజల ఆరోగ్యం కోసం కొంత సమయమైనా పని చేయాలి అని వెంకయ్యనాయుడు కోరారు.
Read Also: Haryana: వామ్మో.. ఎంతగా బరితెగించేశారో..!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
జీవన శైలిలో వచ్చిన మార్పులు వల్ల అనారోగ్యాలు పెరుగుతున్నాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రజలు దేవుడి తరువాత వైద్యులను దేవుడిలా భావిస్తారు.. అందరి జీవితం స్వచ్ఛంగా ఉండాలి.. మన ఇళ్లు, గ్రామం శుభ్రంగా ఉంచుకోవాలి.. అందుకోసమే మన ప్రధాని స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు అని పేర్కొన్నారు. జర్మనీ, రష్యా, చైనా వంటి దేశాలు మాతృ భాషలోనే విద్యాభోధన సాగిస్తున్నాయి.. మన ప్రభుత్వాలు కూడా మాతృ భాషకి ప్రాధాన్యమివ్వాలి అని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపాలి.. గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్నవారు ఉన్నతస్థానాలలో ఉన్నారు.. బాగా సంపాదించి, సొంత ప్రాంతాల అభివృద్దికి తోడ్పడుతున్నారు.. ఇంట్లోనే వంట చేసుకోవాలి.. ఆడవారే వంట చేయాలని ఏమీ లేదు.. మగవారు కూడా వంట చేయడంలో తప్పులేదన్నారు. పాతకాలం నాటి మిల్లెట్స్ వంటకాలు ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ దొరుకుతున్నాయి.. వైద్యం కూడా కమర్షియల్ అయిపోయింది.. ఫైవ్ స్టార్ హాస్పిటల్స్ వచ్చేశాయి.. అవసరమైన పరీక్షలే చేయించి, అవసరమైన మందులు ఇవ్వాలి అని వెంకయ్య నాయుడు సూచించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!