Kidney Stones: ఈ కూరగాయలను ఎక్కువగా తీస్తున్నారా? కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు జాగ్రత్త సుమీ
- కొన్ని రకాల కూరగాయలను ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్ల సమస్యలు.
- మన జీవనశైలి, తినే ఆహారం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యలు.
- ఆక్సలేట్ అధికంగా ఉన్న కూరగాయలను తింటే కిడ్నీలో రాళ్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney Stones: కిడ్నీలో రాళ్ల సమస్య అనేది ఎంతో ఒకరకంగా తీవ్రమైన వ్యాధిగా పరిగణించవచ్చు. కిడ్నీలో రాళ్ల వల్ల కలిగే నొప్పిని అనుభవించినవారికి మాత్రమే దీని తీవ్రత తెలుసు. ప్రస్తుతం కాలంలో రాళ్ల సమస్య సాధారణంగా మారిపోయింది. దీని ప్రధాన కారణాలు మన జీవనశైలి, తినే ఆహారం. కిడ్నీ రాళ్ల సమస్య నుంచి దూరంగా ఉండాలంటే మనం తగినంత నీటిని త్రాగడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, కొన్ని కూరగాయలు రాళ్ల సమస్యను పెంచుతాయి. అవేంటో తెలుసుకుందాం.
Also Read: SA20 2025: SA20 టీ20 లీగ్కు సర్వం సిద్ధం.. మ్యాచ్లను ఎక్కడ చూడచ్చంటే?
Also Read
- Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
- Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- 204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
పాలకూర:
పాలకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ఎక్కువగా తినడం మాత్రం మంచిది కాదు. పాలకూరలో ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. ఈ ఆక్సలేట్ కిడ్నీలో రాళ్లను ఏర్పడేందుకు కారణం అవుతుంది. కాబట్టి ఇప్పటికే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు లేదా రాళ్లు రాకుండా జాగ్రత్త పడేవారు పాలకూరను మితంగా తినడం మంచిది.
వంకాయ:
వంకాయలో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అయితే, వీటితో పాటు వంకాయలో కూడా ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. ప్రత్యేకంగా వంకాయ గింజలలో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వంకాయ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.
టమోటా:
ప్రతి రోజూ మన వంటకాలలో వాడే టమోటాలో ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా టమోటా గింజలలో ఇది ఎక్కువగా ఉంటుంది. రోజూ ఎక్కువగా టమోటా తినడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యకు దారి తీస్తుంది.
Also Read: Group 3 Preliminary Key: గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ప్రిలిమినరీ కీ రిలీజ్
దోసకాయ లేదా కీరదోస:
సలాడ్లో ఎక్కువగా వాడే దోసకాయ, కీరదోస ఆరోగ్యానికి మంచివే. కానీ వీటిని అధికంగా తినడం కిడ్నీలో రాళ్ల సమస్యకు దారితీస్తుంది. వీటి గింజలలో ఆక్సలేట్ అధికంగా ఉండటం వల్ల కిడ్నీలో ప్రమాదం ఎక్కువ అవుతుంది.
ఆలుగడ్డ, సోయాబీన్:
“నేషనల్ కిడ్నీ ఫౌండేషన్” నివేదిక ప్రకారం.. రోజూ తినే కూరగాయలలో కొన్ని కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతాయి. అలాంటి కూరగాయలలో ఆలుగడ్డ, సోయాబీన్ కూడా ఉన్నాయి. వీటిని అధికంగా తినడం కిడ్నీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. కాబట్టి, ఇప్పటికే రాళ్ల సమస్య ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!