Kidney Stones: ఈ కూరగాయలను ఎక్కువగా తీస్తున్నారా? కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు జాగ్రత్త సుమీ
- కొన్ని రకాల కూరగాయలను ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్ల సమస్యలు.
- మన జీవనశైలి, తినే ఆహారం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యలు.
- ఆక్సలేట్ అధికంగా ఉన్న కూరగాయలను తింటే కిడ్నీలో రాళ్లు.
Kidney Stones: కిడ్నీలో రాళ్ల సమస్య అనేది ఎంతో ఒకరకంగా తీవ్రమైన వ్యాధిగా పరిగణించవచ్చు. కిడ్నీలో రాళ్ల వల్ల కలిగే నొప్పిని అనుభవించినవారికి మాత్రమే దీని తీవ్రత తెలుసు. ప్రస్తుతం కాలంలో రాళ్ల సమస్య సాధారణంగా మారిపోయింది. దీని ప్రధాన కారణాలు మన జీవనశైలి, తినే ఆహారం. కిడ్నీ రాళ్ల సమస్య నుంచి దూరంగా ఉండాలంటే మనం తగినంత నీటిని త్రాగడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, కొన్ని కూరగాయలు రాళ్ల సమస్యను పెంచుతాయి. అవేంటో తెలుసుకుందాం.
Also Read: SA20 2025: SA20 టీ20 లీగ్కు సర్వం సిద్ధం.. మ్యాచ్లను ఎక్కడ చూడచ్చంటే?
Also Read
- Kollywood: తమిళనాట నిలిచిపోయిన షూటింగ్స్.. నిర్మాతల సంచలన నిర్ణయం!
- CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
- Batchmates Web Series :మళ్ళీ కాలేజ్ రోజుల్లోకి.. ‘బ్యాచ్మేట్స్’ సిరీస్ రివ్యూ
- Dragon: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..
పాలకూర:
పాలకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ఎక్కువగా తినడం మాత్రం మంచిది కాదు. పాలకూరలో ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. ఈ ఆక్సలేట్ కిడ్నీలో రాళ్లను ఏర్పడేందుకు కారణం అవుతుంది. కాబట్టి ఇప్పటికే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు లేదా రాళ్లు రాకుండా జాగ్రత్త పడేవారు పాలకూరను మితంగా తినడం మంచిది.
వంకాయ:
వంకాయలో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అయితే, వీటితో పాటు వంకాయలో కూడా ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. ప్రత్యేకంగా వంకాయ గింజలలో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వంకాయ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.
టమోటా:
ప్రతి రోజూ మన వంటకాలలో వాడే టమోటాలో ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా టమోటా గింజలలో ఇది ఎక్కువగా ఉంటుంది. రోజూ ఎక్కువగా టమోటా తినడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యకు దారి తీస్తుంది.
Also Read: Group 3 Preliminary Key: గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ప్రిలిమినరీ కీ రిలీజ్
దోసకాయ లేదా కీరదోస:
సలాడ్లో ఎక్కువగా వాడే దోసకాయ, కీరదోస ఆరోగ్యానికి మంచివే. కానీ వీటిని అధికంగా తినడం కిడ్నీలో రాళ్ల సమస్యకు దారితీస్తుంది. వీటి గింజలలో ఆక్సలేట్ అధికంగా ఉండటం వల్ల కిడ్నీలో ప్రమాదం ఎక్కువ అవుతుంది.
ఆలుగడ్డ, సోయాబీన్:
“నేషనల్ కిడ్నీ ఫౌండేషన్” నివేదిక ప్రకారం.. రోజూ తినే కూరగాయలలో కొన్ని కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతాయి. అలాంటి కూరగాయలలో ఆలుగడ్డ, సోయాబీన్ కూడా ఉన్నాయి. వీటిని అధికంగా తినడం కిడ్నీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. కాబట్టి, ఇప్పటికే రాళ్ల సమస్య ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Kollywood: తమిళనాట నిలిచిపోయిన షూటింగ్స్.. నిర్మాతల సంచలన నిర్ణయం!
-
CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
-
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికలు.. మే 4న కేవలం 293 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు.. కారణం ఏమిటి?
-
Batchmates Web Series :మళ్ళీ కాలేజ్ రోజుల్లోకి.. ‘బ్యాచ్మేట్స్’ సిరీస్ రివ్యూ
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. ముందున్న కఠినమైన సవాళ్లు ఇవే!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!