Varun Gandhi: బీజేపీకి షాక్.. త్వరలో కాంగ్రెస్ లోకి వరుణ్ గాంధీ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Gandhi: ఇందిరాగాంధీ మనుమడు, మేనకా- సంజయ్ గాంధీల వారసుడు వరుణ్ గాంధీ బీజేపీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావాలనే డిమాండ్లు జోరుగా వస్తున్నాయి. కాంగ్రెస్ మద్దతుదారులు, కింది స్థాయి నేతలు తరచుగా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఈ విషయమై పదే పదే కోరుతున్నారు. గత కొంతకాలంగా అడపాదడపా సొంత పార్టీ బీజేపీ పైనే ఆయన విమర్శలు ఎక్కుపెట్టడం, మోదీ ప్రభుత్వ విధానాలను విమర్శించడమే దీనికి సంకేతంగా భావిస్తున్నారు.
Read Also: Russian Ukrainian War: ప్రతీకారం తీర్చుకున్న రష్యా.. 600మంది ఉక్రెయిన్ల హతం
Also Read
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
తాను కాంగ్రెస్ కు వ్యతిరేకం కాదని మన రాజకీయాల లక్ష్యం ప్రజలను కలిపి ఉంచేలా ఉండాలేగానీ, అంతర్గత యుద్ధాన్ని ప్రేరేపించేలా ఉండకూడదు. మతం, కులం పేరిట ఓట్లు అడుగుతున్నవారిని.. ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి తీవ్రమైన అంశాలపై మీరు ఏం చేస్తున్నారని ప్రజలు అడగాల్సి ఉందంటూ తన నియోజకవర్గ(ఫిలిబిత్) ప్రజలను ఉద్దేశించి వరుణ్గాంధీ వ్యాఖ్యానించారు. ఇవి సొంత పార్టీని ఉద్దేశించి మాట్లాడినట్లు ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వరుణ్ గాంధీని కాంగ్రెస్ లోకి ఆహ్వానించాలంటూ డిమాండ్ చేసారు. వరుణ్ గాంధీ ప్రస్తుతం యూపీలోని సుల్తాన్ పూర్ ఎంపీగా ఉన్నారు. ఆ రాష్ట్రంలో కుదేలైన కాంగ్రెస్ కు పునర్వైభవం దక్కాలంటే వరుణ్ కు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని ఉమేష్ పండిట్ అనే యూపీ నేత కోరారు.
Read Also: Adilabad Safe District: ఆదిలాబాద్.. దేశంలోనే సురక్షితమయిన జిల్లా
వరుణ్ తల్లి మేనకాగాంధీకి 2019లో తిరిగి మోదీ కేబినెట్లో స్థానం కల్పించనప్పుడే ఆయన అసమ్మతి బయటపడింది. ఆ సమయంలోనే బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి కూడా ఇద్దరినీ(మేనక, వరుణ్లను) పక్కన పెట్టారు. వాజపేయి-ఆడ్వాణీల హయాంలో వరుణ్, ఆయన తల్లి మేనకాగాంధీకి బీజేపీలో మంచి ప్రాధాన్యం లభించింది. రాజ్నాథ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతి చిన్న వయసులోనే ప్రధాన కార్యదర్శిగానూ వరుణ్ నియమితులయ్యారు. అయితే, అమిత్షా పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తల్లీ, కొడుకుల రెక్కలు కత్తిరించడం ప్రారంభమైంది. అమిత్షా హయాంలోనే వరుణ్ను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. మోదీ-అమిత్షాల హయాంలో ఇక తమకు పార్టీలో భవిష్యత్తు ఉండదని వరుణ్గాంధీ భావిస్తున్నారు. దీంతో ఆయన బీజేపీని వీడి, కాంగ్రెస్ లో చేరాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!