Varun Gandhi: బీజేపీకి షాక్.. త్వరలో కాంగ్రెస్ లోకి వరుణ్ గాంధీ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Gandhi: ఇందిరాగాంధీ మనుమడు, మేనకా- సంజయ్ గాంధీల వారసుడు వరుణ్ గాంధీ బీజేపీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావాలనే డిమాండ్లు జోరుగా వస్తున్నాయి. కాంగ్రెస్ మద్దతుదారులు, కింది స్థాయి నేతలు తరచుగా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఈ విషయమై పదే పదే కోరుతున్నారు. గత కొంతకాలంగా అడపాదడపా సొంత పార్టీ బీజేపీ పైనే ఆయన విమర్శలు ఎక్కుపెట్టడం, మోదీ ప్రభుత్వ విధానాలను విమర్శించడమే దీనికి సంకేతంగా భావిస్తున్నారు.
Read Also: Russian Ukrainian War: ప్రతీకారం తీర్చుకున్న రష్యా.. 600మంది ఉక్రెయిన్ల హతం
Also Read
- WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
- Indian Rupee: రూపాయికి 'చీకటి' రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
తాను కాంగ్రెస్ కు వ్యతిరేకం కాదని మన రాజకీయాల లక్ష్యం ప్రజలను కలిపి ఉంచేలా ఉండాలేగానీ, అంతర్గత యుద్ధాన్ని ప్రేరేపించేలా ఉండకూడదు. మతం, కులం పేరిట ఓట్లు అడుగుతున్నవారిని.. ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి తీవ్రమైన అంశాలపై మీరు ఏం చేస్తున్నారని ప్రజలు అడగాల్సి ఉందంటూ తన నియోజకవర్గ(ఫిలిబిత్) ప్రజలను ఉద్దేశించి వరుణ్గాంధీ వ్యాఖ్యానించారు. ఇవి సొంత పార్టీని ఉద్దేశించి మాట్లాడినట్లు ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వరుణ్ గాంధీని కాంగ్రెస్ లోకి ఆహ్వానించాలంటూ డిమాండ్ చేసారు. వరుణ్ గాంధీ ప్రస్తుతం యూపీలోని సుల్తాన్ పూర్ ఎంపీగా ఉన్నారు. ఆ రాష్ట్రంలో కుదేలైన కాంగ్రెస్ కు పునర్వైభవం దక్కాలంటే వరుణ్ కు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని ఉమేష్ పండిట్ అనే యూపీ నేత కోరారు.
Read Also: Adilabad Safe District: ఆదిలాబాద్.. దేశంలోనే సురక్షితమయిన జిల్లా
వరుణ్ తల్లి మేనకాగాంధీకి 2019లో తిరిగి మోదీ కేబినెట్లో స్థానం కల్పించనప్పుడే ఆయన అసమ్మతి బయటపడింది. ఆ సమయంలోనే బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి కూడా ఇద్దరినీ(మేనక, వరుణ్లను) పక్కన పెట్టారు. వాజపేయి-ఆడ్వాణీల హయాంలో వరుణ్, ఆయన తల్లి మేనకాగాంధీకి బీజేపీలో మంచి ప్రాధాన్యం లభించింది. రాజ్నాథ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతి చిన్న వయసులోనే ప్రధాన కార్యదర్శిగానూ వరుణ్ నియమితులయ్యారు. అయితే, అమిత్షా పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తల్లీ, కొడుకుల రెక్కలు కత్తిరించడం ప్రారంభమైంది. అమిత్షా హయాంలోనే వరుణ్ను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. మోదీ-అమిత్షాల హయాంలో ఇక తమకు పార్టీలో భవిష్యత్తు ఉండదని వరుణ్గాంధీ భావిస్తున్నారు. దీంతో ఆయన బీజేపీని వీడి, కాంగ్రెస్ లో చేరాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
-
Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!