Gyanvapi mosque case: శివలింగం కార్బన్ డేటింగ్పై అక్టోబర్ 14న న్యాయస్థానం తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi mosque case: ఈ ఏడాదిలో ప్రారంభం అయిన జ్ఞానవాపి మసీదు కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ముందుగా వారణాసి సివిల్ కోర్టు మసీదులో వీడియో సర్వేకు అనుమతి ఇవ్వడంతో అక్కడి వాజూఖానాలో శివలింగం వంటి ఆకారం బయటపడింది. ఒక్కసారిగా ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరో వైపు అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం.. ఆ తరువాత ఈ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు వారణాసి జిల్లా కోర్టు పరిధిలో ఉంది. విచారణలో హిందూ పక్షం లాయర్ శివలింగంపై శాస్త్రీయ పరిశోధన జరగాలని..అందుకు ‘కార్బన్ డేటింగ్’ చేయాలని కోర్టును కోరిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై వారణాసి కోర్టు అక్టోబర్ 14న తీర్పును వెలువరించనుందని హిందూ, ముస్లిం పక్షాల న్యాయవాదులు మంగళవారం చెప్పారు. ఈ విచారణ నిమిత్తం అక్టోబర్ 11న ముస్లిం పక్షం తమ వాదనలను కోర్టుకు వినిపించింది.
ప్రారంభంలో జ్ఞానవాపీ మసీదు వెలుపల ఉన్న హిందూ దేవీదేవతలకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసులో గత నెలలో శాస్త్రీయ దర్యాప్తు కోసం పిటిషన్ దాఖలు అయింది. శివలింగం వయసును నిర్థారించేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాచే కార్బన్ డేటింగ్ నిర్వహించాలని మహిళలు తమ పిటిషన్ లో కోరారు. ఇదిలా ఉంటే ఐదుగురు మహిళల్లో నలుగురు శాస్త్రీయ అధ్యయనం కోసం కార్బన్ డేటింగ్ కోరాగా.. దీని వల్ల శివలింగానికి హాని కలుగవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
Fake Astronaut Scams: వ్యోమగామినంటూ వల.. భూమికి తిరిగిరాగానే పెళ్లంటూ లక్షలు గుంజాడు..
ఇదిలా ఉంటే ముస్లింపక్షం శాస్త్రీయ విచారణపై అబ్యంతరాన్ని వ్యక్తం చేసింది. హిందూ మహిళలు చెబుతున్నట్లు జ్ఞానవాపి మసీదుకు ఎలాంటి సంబంధం లేదని.. శివలింగం అని పిలువబడుతున్న ఆకారం ఓ ఫౌంటెన్ అని మసీదు కమిటీ చెబుతోంది. కోర్టు అంతకుముందు విచారణలో కీలక తీర్పు వెల్లడించింది. ప్రార్థనా స్థలాల చట్టం-1991 ఈ కేసులో వర్తించదని తీర్పు చెప్పింది. ఇది ఆగస్టు15, 1947 కన్నా ముందు నుంచే మనుగడలో ఉండటంతో ఈ చట్టం వర్తించదని వెల్లడించింది.
తాజావార్తలు
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
-
Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
-
Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..