Gyanvapi Mosque: నేడు జ్ఞాన్వాపీ ఏఎస్ఐ సర్వే నివేదికపై వారణాసి కోర్టు తుది తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi ASI Survey Verdict: జ్ఞాన్వాపీ ఆర్కియాలజీ సర్వే నివేదికపై వారణాసి కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఏఎస్ఐ సర్వే రిపోర్టును బహిరంగపరచాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించనుంది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు నిర్ణయాన్ని బుధవారం నాడు రిజర్వ్ చేసింది. ఈ కేసు తీర్పు గురువారం రావాల్సి ఉంది.. కానీ అది నిన్నటికి (శుక్రవారం) వాయిదా పడింది.. కానీ తుది తీర్పు ఇవాళ వచ్చే అవకాశం ఉంది.
Read Also: Kapil Dev Birthday: కపిల్ దేవ్ బర్త్ డే.. రజనీకాంత్ ‘లాల్ సలామ్’ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్!
Also Read
- Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
- Venkaiah Naidu: యోగాను మతంతో ముడిపెట్టడం మూర్ఖత్వం..
- Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్చేస్తే..
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
అయితే, జ్ఞాన్వాపీ ఏఎస్ఐ రిపోర్టుపై హిందూ వర్గీయుల చాలా ఉత్సాహంగా ఉన్నారు.. ఈ నివేదికను బహిరంగపరచాలని వారు నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. అయితే, నివేదికను బహిరంగపరచడంపై ముస్లిం పక్షానికి చెందిన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జ్ఞాన్వాపి సర్వే నివేదికను ఏఎస్ఐ సీల్డ్ కవరులో కోర్టుకు సమర్పించింది. అప్పటి నుంచి నివేదికను బయటకు తెలియజేయాలని హిందూ వర్గీయులు.. బహిర్గతం చేయొద్దని ముస్లిం పక్ష నేతలు డిమాండ్ చేయడంతో.. ఏఎస్ఐ కూడా కోర్టులో ఒక దరఖాస్తును సమర్పించింది. వచ్చే 4 వారాల పాటు పబ్లిక్ చేయకూండా చూడాలని డిమాండ్ చేసింది. జ్ఞాన్వాపీకి సంబంధించి 1991 కేసును మళ్లీ విచారించాలని హైకోర్టు ఇటీవల ఆదేశించిందనే విషయాన్ని ఏఎస్ఐ తెలిపింది.
Read Also: Thandel : బుజ్జి తల్లే వచ్చేత్తున్న కదే.. ఈ సారి గురి తప్పదేలే అంటున్న నాగచైతన్య
ఇక, హిందూ పక్షం తరపున న్యాయవాది సుభాష్ నందన్ చతుర్వేది మాట్లాడుతూ.. ఏఎస్ఐ తన సర్వే నివేదికను సీలు చేసిన కవరులో కోర్టుకు సమర్పించిందని తెలిపారు. సీల్డ్ కవరులో నివేదిక ఉండకూడదని కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిని గోప్యంగా ఉంచాలని ముస్లిం పక్ష నేతలు కోరుతోంది. అందువల్ల, నివేదికను బహిరంగపరచాలా వద్దా అనే దానిపై కోర్టు ఈ రోజు నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటు అంజుమన్ అరేంజ్ మెంట్స్ మసీదు కమిటీ కూడా కోర్టులో దరఖాస్తు చేసింది. ఇందులో జ్ఞాన్వాపీలోని వుజుఖానాను శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు. వుజుఖానాలో చేపలు చనిపోతున్నాయని ఈ దరఖాస్తులో వెల్లడించింది.
తాజావార్తలు
-
Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
-
Toxic Update : ‘టాక్సిక్’ మళ్లీ ట్రాక్లోకి.. యష్ ఫ్యాన్స్ కోసం వచ్చే వారం సాలిడ్ సర్ప్రైజ్?
-
Venkaiah Naidu: యోగాను మతంతో ముడిపెట్టడం మూర్ఖత్వం..
-
London train crash: ఘోర రైలు ప్రమాదం.. ఇద్దరు మృతి, 80 మందికి పైగా గాయాలు
-
Pooja Hegde: పూజా హెగ్డే తగ్గాల్సిందే.. లేదంటే కష్టమే!
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!