Gyanvapi Mosque: నేడు జ్ఞాన్వాపీ ఏఎస్ఐ సర్వే నివేదికపై వారణాసి కోర్టు తుది తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi ASI Survey Verdict: జ్ఞాన్వాపీ ఆర్కియాలజీ సర్వే నివేదికపై వారణాసి కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఏఎస్ఐ సర్వే రిపోర్టును బహిరంగపరచాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించనుంది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు నిర్ణయాన్ని బుధవారం నాడు రిజర్వ్ చేసింది. ఈ కేసు తీర్పు గురువారం రావాల్సి ఉంది.. కానీ అది నిన్నటికి (శుక్రవారం) వాయిదా పడింది.. కానీ తుది తీర్పు ఇవాళ వచ్చే అవకాశం ఉంది.
Read Also: Kapil Dev Birthday: కపిల్ దేవ్ బర్త్ డే.. రజనీకాంత్ ‘లాల్ సలామ్’ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్!
Also Read
- The Hundred: వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.! అయినా హ్యాట్రిక్ కాదు.. ఎందుకంటే.?
- Rega Kantha Rao: "కేసు కొట్టేయండి".. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు..
- ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
- Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 31 వరకే ఛాన్స్!
అయితే, జ్ఞాన్వాపీ ఏఎస్ఐ రిపోర్టుపై హిందూ వర్గీయుల చాలా ఉత్సాహంగా ఉన్నారు.. ఈ నివేదికను బహిరంగపరచాలని వారు నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. అయితే, నివేదికను బహిరంగపరచడంపై ముస్లిం పక్షానికి చెందిన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జ్ఞాన్వాపి సర్వే నివేదికను ఏఎస్ఐ సీల్డ్ కవరులో కోర్టుకు సమర్పించింది. అప్పటి నుంచి నివేదికను బయటకు తెలియజేయాలని హిందూ వర్గీయులు.. బహిర్గతం చేయొద్దని ముస్లిం పక్ష నేతలు డిమాండ్ చేయడంతో.. ఏఎస్ఐ కూడా కోర్టులో ఒక దరఖాస్తును సమర్పించింది. వచ్చే 4 వారాల పాటు పబ్లిక్ చేయకూండా చూడాలని డిమాండ్ చేసింది. జ్ఞాన్వాపీకి సంబంధించి 1991 కేసును మళ్లీ విచారించాలని హైకోర్టు ఇటీవల ఆదేశించిందనే విషయాన్ని ఏఎస్ఐ తెలిపింది.
Read Also: Thandel : బుజ్జి తల్లే వచ్చేత్తున్న కదే.. ఈ సారి గురి తప్పదేలే అంటున్న నాగచైతన్య
ఇక, హిందూ పక్షం తరపున న్యాయవాది సుభాష్ నందన్ చతుర్వేది మాట్లాడుతూ.. ఏఎస్ఐ తన సర్వే నివేదికను సీలు చేసిన కవరులో కోర్టుకు సమర్పించిందని తెలిపారు. సీల్డ్ కవరులో నివేదిక ఉండకూడదని కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిని గోప్యంగా ఉంచాలని ముస్లిం పక్ష నేతలు కోరుతోంది. అందువల్ల, నివేదికను బహిరంగపరచాలా వద్దా అనే దానిపై కోర్టు ఈ రోజు నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటు అంజుమన్ అరేంజ్ మెంట్స్ మసీదు కమిటీ కూడా కోర్టులో దరఖాస్తు చేసింది. ఇందులో జ్ఞాన్వాపీలోని వుజుఖానాను శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు. వుజుఖానాలో చేపలు చనిపోతున్నాయని ఈ దరఖాస్తులో వెల్లడించింది.
తాజావార్తలు
-
Moto Pad 70 Groove: 10,200mAh బ్యాటరీ, 9 JBL స్పీకర్లతో మోటరోలా కొత్త ట్యాబ్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
The Hundred: వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.! అయినా హ్యాట్రిక్ కాదు.. ఎందుకంటే.?
-
Rega Kantha Rao: “కేసు కొట్టేయండి”.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు..
-
August 2026 Horoscope: ఆగస్టులో ఈ 4 రాశులకు ఆర్థికంగా కలిసొచ్చే అవకాశం.. ఆకస్మిక ధనలాభాలు?
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!