Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసులో తీర్పు వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Mosque Case: జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణంలోని శివలింగాన్ని పూజించేలా అనుమతి ఇవ్వాలంటూ హిందువుల పక్షాన దాఖలైన పిటిషన్పై వారణాసిలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు మంగళవారం విచారణను నవంబర్ 14కి వాయిదా వేసింది. సంబంధిత న్యాయమూర్తి నేడు ఫాస్ట్ట్రాక్ కోర్టుకు హాజరుకానందున తదుపరి విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేశారు.జ్ఞానవాపి కాంప్లెక్స్ ప్రాంగణంలో స్వయంభూ జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వరుని ప్రార్థనను వెంటనే ప్రారంభించేందుకు అనుమతి, జ్ఞానవాపి సముదాయం మొత్తాన్ని హిందువులకు అప్పగించడం, ముస్లింల ప్రవేశాన్ని నిషేధించడం వంటి మూడు ప్రధాన డిమాండ్లపై న్యాయస్థానం తన తీర్పును వెలువరించాల్సి ఉంది. ప్రస్తుతం ముస్లింలు ప్రార్థనలు చేసేందుకు అనుమతించడం గమనార్హం.
అక్టోబరులో జరిగిన మునుపటి విచారణలో, వారణాసి కోర్టు ‘శివలింగం’పై ‘శాస్త్రీయ దర్యాప్తు’ని అనుమతించడానికి నిరాకరించింది. జ్ఞానవాపి మసీదు వాజుఖానాలో దొరికిన శివలింగం అని వారు చెప్పుకునే నిర్మాణానికి కార్బన్ డేటింగ్ ఇవ్వాలని హిందూ పక్షం డిమాండ్ చేసింది. అయితే దొరికిన నిర్మాణం ‘ఫౌంటెన్’ అని ముస్లిం పక్షం పేర్కొంది. హిందూ పక్షం వారణాసి జిల్లా కోర్టులో సెప్టెంబర్ 22న ‘శివలింగం’ అని చెప్పుకునే వస్తువు కార్బన్ డేటింగ్ను కోరుతూ ఒక దరఖాస్తును సమర్పించింది.
జ్ఞానవాపి మసీదు ఆవరణలో దొరికిన శివలింగంపై ‘శాస్త్రీయ పరిశోధన’కు అనుమతి నిరాకరించిన వారణాసి కోర్టు తీర్పుపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హిందూ పక్షం పేర్కొంది.
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
Polish Leader: యువతుల అతి మద్యపానమే సంక్షోభానికి కారణం.. పోలిష్ నేత సంచలన వ్యాఖ్యలు
సెప్టెంబరు 29 విచారణలో హిందూ పక్షం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేత శివలింగాన్ని కార్బన్ డేటింగ్తో శాస్త్రీయ పరిశోధన చేయాలని డిమాండ్ చేసింది. మే 17న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావిస్తూ.. శాంపిల్స్ తీసుకోవడం ద్వారా ఆరోపించిన శివలింగం దెబ్బతిన్నట్లయితే, అది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు అవుతుందని వారణాసి కోర్టు పేర్కొంది. శివలింగం దెబ్బతింటే సాధారణ ప్రజల మతపరమైన మనోభావాలు దెబ్బతింటాయని వారణాసి కోర్టు పేర్కొంది. కార్బన్ డేటింగ్ అనేది పురావస్తు వస్తువు, పురావస్తు పరిశోధనల వయస్సును నిర్ధారించే ఒక శాస్త్రీయ ప్రక్రియ. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జ్ఞాన్వాపి మసీదు-శృంగర్ గౌరీ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. జ్ఞానవాపి మసీదులో పూజలకు సంబంధించిన కేసును సివిల్ జడ్జి నుంచి వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తూ మే 20న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 14న వారణాసిలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!