Vangalapudi Anitha: వైఎస్ జగన్ ఎవరిని టచ్ చేయకూడదో.. వాళ్లనే టచ్ చేశారు!
- హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
- జగన్ అతని గొయ్యి అతనే తవ్వుకున్నారు
- పవన్ కళ్యాణ్ మేం ఉన్నాం అని ధైర్యం ఇచ్చారు
- నాయకుడికి భాద్యత, జవాబుదారీతనం ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangalapudi Anitha vs YS Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. అధికార దుర్వినియోగం చేసి జగన్ అతని గొయ్యి అతనే తవ్వుకున్నారన్నారు. ఎవరిని టచ్ చేయకూడదో జగన్ వాళ్లనే టచ్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత ఎంపీ రఘురామకృష్ణరాజును క్రూరంగా హింసించారని మంత్రి విమర్శించారు. ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఉప్పుటేరు వంతెన వద్ద హోంమంత్రి అనితకు ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, కనుమూరి భారత్ ఘన స్వాగతం పలికారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో హోం మంత్రి అనిత పాల్గొన్నారు.
Also Read: YS Jagan: గవర్నర్తో వైఎస్ జగన్ దంపతుల భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!
Also Read
- AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
- Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
- Botsa Satyanarayana: డీఎస్సీపై చర్చకు ఎందుకు రాలేదు?: సవాళ్లు మాత్రం విసురుతారు..
- Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
‘వైఎస్ జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారు. జగన్ ఎవరిని టచ్ చేయకూడదో వాళ్లనే టచ్ చేశారు. ఎవరైనా ఇది తప్పు అని అడిగితే అది సరిచేసుకోవాలి లేదా ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి. ఈ రెండు కాకుండా నువ్వు అడిగితే కేసు పెడతా, గట్టిగా మాట్లాడితే జైలుకు పంపిస్తా అన్నట్లు వ్యవహరించారు. సొంత ఎంపీ రఘురామకృష్ణరాజును క్రూరంగా హింసించారు. రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులతో మాట్లాడి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేం ఉన్నాం అని ధైర్యం ఇచ్చారు. ఓటు వేసిన తరువాత ప్రజల పట్ల నాయకుడికి భాద్యత, జవాబుదారీతనం ఉండాలి. ఈరోజు మేము అంతా జవాబుదారీతనంతో ఉన్నాం. నేను ఓట్లు అడిగేందుకు రాలేదు. ఆకివీడు ప్రజలకు ఏం కావాల్లో అడిగేందుకు వచ్చా. నా పర్యటనకు చెట్లు కొట్టాల్సిన పని లేదు, షాపులు కట్టక్కర్లేదు, పరదాలు అవసరం లేదు. నా అజెండా అభివృద్ధి, సంక్షేమే.. పగలు ప్రతీకారాలు కాదు’ అని హోంమంత్రి అనిత చెప్పారు.
వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి పాలనలో కూటమి ప్రభుత్వం వికాసం వైపు నడిపిస్తోంది. ఏడాది పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయడంతో పాటు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా… pic.twitter.com/ed752ZghVH
— Anitha Vangalapudi (@Anitha_TDP) July 28, 2025
తాజావార్తలు
-
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
-
AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
-
Varalakshmi Vratam Naivedyam Recipes : వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. 5 నైవేద్యాలు ఇలా చేస్తే టైమ్ సేవ్.!
-
Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!