ప్రేమికుల రోజు సందర్భంగా బాక్సాఫీస్ వద్ద మూడు ప్రధాన చిత్రాలు పోటీ పడ్డాయి. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో వచ్చిన ‘సీతా పయనం’, విశ్వక్ సేన్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ (Funky), సంతోష్ శోభన్ నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’. అయితే వారాంతంలో భారత్-పాకిస్థాన్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ ప్రభావం, ఆపై సోమవారం నాటి వర్కింగ్ డే ఎఫెక్ట్ ఈ సినిమాలపై స్పష్టంగా కనిపించింది.
Also Read : Jai Hanuman : హంపి వేదికగా ‘జై హనుమాన్’ గ్రాండ్ లాంచ్.. రిషబ్ శెట్టితో రానా దగ్గుబాటి స్క్రీన్ షేర్?
ముందుగా సీతా పయనం గురించి మాట్లాడుకుంటే.. అర్జున్ సర్జా తన కుమార్తె ఐశ్వర్యను హీరోయిన్గా పెట్టి తీసిన ఈ సినిమాకు ఏమాత్రం ఊపు రాలేదు. ప్రమోషన్లు బాగానే చేసినప్పటికి నెగటివ్ టాక్ రావడంతో మొదటి రోజే థియేటర్లు వెలవెలబోయాయి. సోమవారం నాటికి ఈ సినిమా బాక్సాఫీస్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫంకీ (Funky) మూవీ విషయంలోను ఇదే పరిస్థితి.. విశ్వక్ సేన్, అనుదీప్ కె.వి కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై మంచి హైప్ ఉండేది. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించినా, కథలో పట్టు లేకపోవడంతో శని, ఆదివారాల్లో వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. సోమవారం ఈ సినిమా కలెక్షన్స్ కోటి రూపాయల కంటే తక్కువకు పడిపోవడం మేకర్స్ను ఆందోళనకు గురిచేస్తోంది. చివరగా..
కపుల్ ఫ్రెండ్లీ.. ఈ మూడు సినిమాల్లో కాస్త బెటర్ పొజిషన్లో ఉన్నది ఈ మూవీ మాత్రమే. పాజిటివ్ రివ్యూలు రావడం, సంతోష్ శోభన్-మానస వారణాసిల కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వడంతో సినిమా నిలబడింది. ఆదివారం నాటి ఇండియా-పాక్ మ్యాచ్ వల్ల వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోయినా, సోమవారం మాత్రం ఇతర సినిమాలతో పోలిస్తే నిలకడగా ఉంది. ప్రస్తుతం చిత్ర బృందం చేస్తున్న యాక్టివ్ ప్రమోషన్లు ఈ సినిమాను గట్టెక్కించే అవకాశం ఉంది.