Vakkantham Vamsi : ఆ ముగ్గురు స్టార్ హీరోల వల్ల నా జీవితం మారిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వక్కంతం వంశీ…ఈ పేరు టాలీవుడ్ లో తెలియని వారు వుండరు. రైటర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసిఆ తరువాత దర్శకుడుగా మారి తనకంటూ టాలీవుడ్ లో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు ఆయన.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాకను తెరకెక్కించారు వక్కంతా వంశీ. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఆయన తన కెరీర్ గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. నేను ఎన్నో సినిమాలకు కథను అందించిన రచయితగా మాత్రమే ఇండస్ట్రీ లో అందరికి తెలుసు. నా జీవితంలో కేవలం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మాత్రమే కాదు ముగ్గురు స్టార్ హీరోల వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు వక్కంతం వంశీ.నేను ముందు నుంచి రైటర్ గానే పనిచేశాను కిక్ సినిమా నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అందులో డైలాగ్స్ కానీ ఆ సినిమాలోని పాత్రలు కానీ నన్ను ఎంతగానో ప్రభావితం చేసాయి.ఆ సినిమా నాకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది.రవితేజ గారు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు వంశీ.
ఇక ఇండస్ట్రీలో ఎన్టీఆర్ నా బెస్ట్ ఫ్రెండ్ అని వంశీ తెలిపారు.నా గురించి ఎన్టీఆర్ కు పూర్తిగా తెలుసు కాబట్టి నన్ను దర్శకుడుగా పరిచయం చేయాలని ఎన్టీఆర్ ఎంతగానో అనుకున్నాడని తనే నన్ను సినిమా కథ రాయమని ఆ సినిమాలో తానే హీరోగా నటిస్తానని చెప్పి మాట కూడా ఇచ్చాడని చెప్పుకొచ్చారు వంశీ.కానీ ఎన్టీఆర్ కు తగ్గ కథ రాయడానికి నేను రెండు నుంచి మూడేళ్ల వరకు సమయం తీసుకున్నానని ఆ కథ ఏ రకంగానూ ముందుకు సాగక పోవడంతో ఆ కథను మధ్యలోనే వదిలేసాను. మరొక సినిమా ఏదైనా చేసి ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ కోసం మొదలు పెట్టిన కథను పూర్తి చేయాలని భావించాను.ఆ సమయంలో నల్లమలుపు బుజ్జి ద్వారా అల్లు అర్జున్ గారిని కలిసి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కథ చెప్పడం జరిగింది ఆ కథ ఓకే కావడం ఆ సినిమాతో అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేయడం జరిగిపోయింది. ఇలా రవితేజ,ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ నా జీవితాన్ని టర్న్ చేసారని వంశీ చెప్పుకొచ్చారు.. భవిష్యత్ లో ఎన్టీఆర్ తో కచ్చితంగా సినిమా చేస్తాను అని ఆయన తెలిపారు.
Also Read
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Bathroom Cleaning Tips: కుళాయిలు, సింక్లు కొత్తవిగా మెరవాలంటే.. ఈ చిట్కాలతో నిమిషాల్లో కొత్త మెరుపు!
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
తాజావార్తలు
-
Gold & Silver Prices Today: ఇలా అయితే కొనేదెట్టా.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
-
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
-
TheParadise : నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?
-
AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం…
-
Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!