Tanvir Ahmed: టీమిండియాలోకి వైభవ్ వస్తే అభిషేక్ శర్మ పని ఖేల్ ఖతం.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
Tanvir Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో ఎందరో యంగ్ టాలెంట్లను మనం చూశాం. కానీ కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ బౌలర్ల బౌలింగ్ను చీల్చి చెండాడుతూ ఒక కుర్రాడు క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటున్నాడు. అతడే రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. గౌహతిలోని బర్సపారా స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు సాధించి స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ వండర్ కిడ్.. జోష్ హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి మేటి బౌలర్లను సైతం బెంబేలెత్తించాడు. ఈ సీజన్లో వైభవ్ వరుసగా రెండోసారి 15 బంతుల్లోనే అర్ధశతకం సాధించడం విశేషం (గతంలో సీఎస్కేపై కూడా ఇలాగే ఆడాడు).
READ ALSO: Chanakya Niti: కొంగ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన ఆ ఒక్క పాఠం ఇదే! చాణక్యుడు చెప్పిన షాకింగ్ నిజం..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
అభిషేక్ శర్మను మర్చిపోతారు: తన్వీర్ అహ్మద్
వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలిపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ ధాటికి టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ క్రేజ్ తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “వైభవ్ టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తే.. ప్రజలు అభిషేక్ శర్మను మర్చిపోతారు. వీరిద్దరూ కలిసి బ్యాటింగ్ చేస్తే అందరి కళ్లు వైభవ్ పైనే ఉంటాయి. అభిషేక్ దరిదాపుల్లో కూడా ఉండడు. ప్రస్తుతం వైభవ్ ఉన్న ఫామ్ చూస్తుంటే ఎవరైనా అతనికే ఓటేస్తారు” అని అన్నారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో అభిషేక్ శర్మ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇదే సమయంలో వైభవ్ నిలకడగా రాణిస్తుండటంతో వీరిద్దరి మధ్య పోలిక మొదలైంది.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు 4 ఇన్నింగ్స్లలో 50.00 సగటుతో 200 పరుగులు సాధించాడు. కేవలం దూకుడుగానే కాకుండా, వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ సంయమనంతో ఆడటం వైభవ్ ప్రత్యేకతగా చెబుతున్నారు. త్వరలోనే టీమిండియాలోకి ఈ యువ సంచలనం అడుగుపెట్టడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి అభిషేక్ శర్మ తన ఫామ్ను అందిపుచ్చుకుంటాడా లేక వైభవ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడా అనేది వేచి చూడాలి.
READ ALSO: US-Iran Talks: యూఎస్-ఇరాన్ చర్చలు విఫలమైతే పాకిస్తాన్కు దబిడి దిబిడే..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!