UP: జడ్జి కుక్క మాయం.. 2 డజన్ల మందిపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధనవంతులు.. లేదంటే వీఐపీలు తమ ఇళ్లల్లో ఖరీదైన కుక్కలు పెంచుకుంటారు. అంతేకాకుండా వాటిని చూసుకునేందుకు కేర్టేకర్ను కూడా ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు బయటకు తీసుకుని వెళ్లినప్పుడు హఠాత్తుగా దాడులకు తెగబడుతుంటాయి. ఇలాంటి ఘటనలు కూడా అనేకం చూశాం. అలాగే ఇంకొన్ని సార్లు ఖరీదైన డాగ్లు మాయం అవుతుంటాయి. వాటి కోసం పోలీసులు వెతికిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? ఓ కుక్క రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది.
ఇది కూడా చదవండి: Ebrahim Raisi Last Journey: ముగిసిన ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలు..
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఓ జడ్జి కుక్క మాయం అయింది. న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు డజన్ల మందిపై కేసు నమోదు చేశారు. తమ పొరుగింటి అహ్మద్ పెంపుడు కుక్కను దొంగిలించినట్లు న్యాయమూర్తి కుటుంబం పోలీసులకు కంప్లంట్ ఇచ్చింది. బరేలీలో సివిల్ జడ్జి నివాసం ఉంటుంది. ఆ ఇంటి నుంచి కుక్క అపహరించబడింది.
ఇది కూడా చదవండి: Kalki – Bujji: 6 టన్నులు-6 కోట్లు.. 30 గంటలు.. ‘బుజ్జి’ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్!
ఇదిలా ఉంటే ఈ కుక్క విషయంలో మే 16న కాలనీలో పెద్ద గొడవే జరిగింది. న్యాయమూర్తి కుటుంబీకులు, అహ్మద్ కుటుంబీకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా అహ్మద్ కుమారుడు ఖాదీర్ఖాన్ న్యాయమూర్తి కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేశాడు. చంపేస్తానని బెదిరించాడు. అంతేకాకుండా మే 16న రాత్రి 9:45 గంటల ప్రాంతంలో అహ్మద్ భార్య న్యాయమూర్తి నివాసానికి వచ్చి తమతో మాట్లాడాలని పట్టుబట్టింది. తమ కుమార్తెపై కుక్క దాడి చేసిందంటూ అహ్మద్ భార్య.. జడ్జి కుటుంబసభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.
న్యాయమూర్తి ప్రస్తుతం హర్దోయ్లో విధులు నిర్వహిస్తుండగా… అతని కుటుంబం బరేలీలోని సన్సిటీ కాలనీలో నివాసం ఉంటుంది. అయితే కుక్క విషయంలో జరిగిన గొడవ తెలియగానే.. అతను లక్నో నుంచి బరేలీ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఫోన్ ద్వారా సంఘటన గురించి సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు కూడా చేశారు. దీంతో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏరియా అధికారి అనితా చౌహాన్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు న్యాయమూర్తి కుక్క కోసం వెతుకుతున్నారు. అంతేకాకుండా జడ్జి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు… జంతు హింస చట్టం కింద రెండు డజన్ల మందికి పైగా వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఇక ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు న్యాయమూర్తి కుటుంబం నిరాకరించింది.
ఇది కూడా చదవండి: Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు నక్సల్స్ మృతి..
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!