Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Uttarakhand Himachal Pradesh Heavy Rain Landslide 81 Dead Imd Red Alert Flash Floods In Punjab Weather Update

Landslide: హిమాచల్-ఉత్తరాఖండ్‌లో వర్ష విధ్వంసం.. 81 మంది మృతి

Published Date :August 17, 2023 , 10:45 am
By Rakesh Reddy
Landslide: హిమాచల్-ఉత్తరాఖండ్‌లో వర్ష విధ్వంసం.. 81 మంది మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Landslide: ఉత్తరాఖండ్‌ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌ వరకు పర్వతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలు తెరపైకి వస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 81 మంది చనిపోయారు. కాగా, చాలా చోట్ల ఇళ్లు కూలిపోవడంతో క్షతగాత్రులను రక్షించేందుకు, శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆగస్టు 17న కొండ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా పంజాబ్‌ రాష్ట్రం వరదల్లో చిక్కుకుంది.

హిమాచల్‌లో 3 రోజుల్లో 31 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల కారణంగా గత మూడు రోజుల్లో కనీసం 71 మంది ప్రాణాలు కోల్పోగా, 13 మంది కనిపించకుండా పోయారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని సమ్మర్ హిల్ సమీపంలోని శివాలయం శిధిలాల నుండి మరో మహిళ మృతదేహాన్ని వెలికితీయడంతో ఇప్పటి వరకు వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన 57 మంది మృతదేహాలను ఇప్పటివరకు వెలికితీశారు. బుధవారం కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా కూలిపోయిన భవనాల శిథిలాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు.

Read Also:Renu Desai : పవన్ అందుకే తరిమేశాడన్న నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన రేణు దేశాయ్..

10 వేల కోట్ల నష్టం
హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిమ్లాలోని సమ్మర్ హిల్, కృష్ణ నగర్, ఫాగ్లీ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) ఓంకార్ చంద్ శర్మ మాట్లాడుతూ.. ‘గత మూడు రోజుల్లో కనీసం 71 మంది మరణించారు. 13 మంది గల్లంతయ్యారు. ఆదివారం రాత్రి నుంచి 57 మృతదేహాలను వెలికితీశారు.’ ఈ రుతుపవనాల కారణంగా ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి తన రాష్ట్రం ఏడాది పడుతుందని సిఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖూ ఎత్తి చూపారు. జరిగిన నష్టాన్ని పూడ్చడానికి సుమారు రూ. 10,000 కోట్లు అవసరమని పేర్కొన్నారు. ఇది పెద్ద సవాలుగా ఆయన అభివర్ణించారు.

కృష్ణానగర్‌లోని దాదాపు 15 ఇళ్లను ఖాళీ చేయించి కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడతాయనే భయంతో పలువురు తమ ఇళ్లను ఖాళీ చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని విద్యా శాఖ ఆదేశించింది. హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం ఆగస్టు 19 వరకు విద్యా కార్యకలాపాలను నిలిపివేసింది. రాష్ట్రంలో దాదాపు 800 రోడ్లు మూసుకుపోయాయి. జూన్ 24న వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి రూ.7,200 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.

ఉత్తరాఖండ్‌లో 10 మంది మృతి
ఉత్తరాఖండ్‌లో కూడా కొండచరియలు విరిగిపడటం, పిడుగుల కారణంగా 10 మంది మరణించారు. మరోవైపు, మద్మహేశ్వర్ ధామ్‌లో భారీ వర్షాల కారణంగా భారీ ప్రవాహంలో చిక్కుకున్న 293 మందిని రక్షించారు. రక్షించబడిన వారిలో ఎక్కువ మంది భక్తులే. చమోలీ జిల్లాలోని హెలాంగ్‌లో ఇల్లు కూలిపోవడంతో ఇద్దరు సోదరులు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. రెండు రోజుల క్రితం పౌరి జిల్లాలోని రిసార్ట్‌లో కొండచరియలు విరిగిపడటంతో శిథిలాల కింద సమాధి అయిన వారందరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మద్మహేశ్వర్ ధామ్ వద్ద స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), పోలీసుల రెస్క్యూ , రిలీఫ్ ఆపరేషన్ పూర్తయింది. అక్కడ చిక్కుకుపోయిన యాత్రికులతో సహా మొత్తం 293 మందిని రక్షించినట్లు రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ తెలిపారు. ‘రోప్ రివర్ క్రాసింగ్ పద్ధతి’, హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా బయటకు తీశారు.

Read Also:Flipkart Smart Watches Offers: ఫ్లిప్‌కార్ట్‌లో 79 శాతం ఆఫర్.. కేవలం రూ. 1499లకే బోట్ సూపర్ స్మార్ట్‌వాచ్!

పంజాబ్‌లో వరదలు
వరద పరిస్థితిని తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బుధవారం చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భాక్రా, పాంగ్ డ్యాంల నుంచి అదనపు నీటిని విడుదల చేయడంతో మూడు జిల్లాల్లోని పలు ప్రాంతాలు జలమయమైనట్లు అధికారులు తెలిపారు. సట్లెజ్ నదిపై ఉన్న భాక్రా డ్యామ్, బియాస్ నదిపై పాంగ్ డ్యామ్ (రెండూ హిమాచల్ ప్రదేశ్‌లో) వాటి పరివాహక ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా నిండిపోయాయని ఆయన తెలియజేశారు. పంజాబ్‌లో నెల రోజుల వ్యవధిలో రెండోసారి వరదలు సంభవించాయి. పంజాబ్‌లోని అనేక ప్రాంతాలు జూలై 9 – 11 మధ్య రాష్ట్రంలో కురిసిన వర్షాలకు ప్రభావితమయ్యాయి. వ్యవసాయ ప్రాంతాలు పెద్ద ఎత్తున వరదలకు గురయ్యాయి.

రాష్ట్రంలో వరద పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, పరిస్థితిని ప్రభుత్వం పర్యవేక్షిస్తున్నదని సీఎం భగవంత్ మాన్ తెలిపారు. తన మంత్రులను కూడా వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలని కోరారు. అదనపు నీటి విడుదలకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు (బిబిఎంబి)తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నందున భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. పాంగ్ డ్యామ్, రంజిత్ సాగర్ డ్యామ్ వద్ద పరిస్థితి కూడా పూర్తిగా నియంత్రణలో ఉంది. భాక్రా, పాంగ్‌ డ్యామ్‌లలో బుధవారం నీటిమట్టం వరుసగా 1,677 అడుగులు, 1,398 అడుగులకు చేరుకుందని ఆయన తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Himachal landslide
  • Himachal Pradesh
  • himachal pradesh rains
  • Imd Alert
  • Punjab Floods

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions