Uttarakhand: విహారయాత్రలో విషాదం.. కారు బోల్తా.. ఐదుగురు విద్యార్థుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్లో ఘోరం జరిగింది. విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారిపోయింది. ఎంతో సంతోషంగా గడపాలని బయల్దేరిన వారిని మృత్యువు కబళించింది. కారు అదుపుతప్పి కొండ మీద నుంచి కిందపడడంతో ఐదుగురు విద్యార్థులు మృతిచెందగా.. మరొక విద్యార్థికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Vadde Sobhanadreeswara Rao: దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ..! ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద కుట్ర..!
Also Read
- CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
- Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
- India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
- Ravi Shastri: "చాలా పెద్ద తప్పు చేస్తున్నారు".. టీమిండియా మేనేజ్మెంట్పై రవిశాస్త్రి ఫైర్!
శనివారం ముస్సోరీలో కారు కొండమీద అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కళాశాల విద్యార్థులు మృతి చెందారు. నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయితో సహా ఐదుగురు కారు ప్రమాదంలో మరణించారు. మరో అమ్మాయికి గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. డెహ్రాడూన్ కాలేజీకి చెందిన విద్యార్థులు ముస్సోరీకి విహారయాత్రకు వచ్చారు. అనుకోని విధంగా ప్రమాదంలో పడి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మరోవైపు మరణవార్త తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Prashanth Varma : హనుమాన్ కోసం అదే రిఫరెన్స్ గా తీసుకున్నా..
డెహ్రాడూన్లోని IMS కళాశాలలో చదువుతున్నారు. నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ముస్సోరీకి విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా శనివారం ఉదయం ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు ఉదయం 5 గంటల సమయంలో ముస్సోరీ-డెహ్రాడూన్ రహదారిపై అదుపు తప్పి పడిపోయి ఉన్నారని తెలిపారు. గాయపడిన నాన్సీ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉన్నందున ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. గత నెల ప్రారంభంలో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. కారు లోయలో పడి కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారు.

తాజావార్తలు
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
-
iQOO Z11i: ఐకూ Z11i విడుదల.. 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Snapdragon 4 Gen 2
-
Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
-
India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!