టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రీసెంట్ గా ‘హనుమాన్’ సినిమాతో ఈ దర్శకుడు తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు..యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుత విజయం సాధించింది.ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్ మూవీ ఏకంగా రూ.250 కోట్లుకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది..ఇదిలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
అయితే హనుమాన్ సినిమాలో హనుమంతుడి విగ్రహం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. అంజనాద్రి కొండపై వెలిసిన ఈ విగ్రహం ఆ మూవీకే హైలెట్గా నిలిచింది. అయితే ఈ హనుమంతుడి విగ్రహం గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికర విషయాలు తెలియజేసాడు .ఈ సినిమాలో హనుమంతుడి విగ్రహంను మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన స్టాలిన్ సినిమాలోని పోస్టర్ రిఫరెన్స్ తీసుకుని డిజైన్ చేసినట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు. స్టాలిన్ సినిమాలోని ఆ పోస్టర్ లో చిరంజీవిని చూడగానే ఏదో తెలియని గూస్ బంప్స్ వస్తుంటాయి. అందుకే ఆ పోస్టర్ను మేము రిఫరెన్స్గా వాడుకున్నాం.ఫైనల్ గా అదిరిపోయే అవుట్ ఫుట్ వచ్చినట్లుగా ప్రశాంత్ వర్మ తెలిపారు..