Maha Kumbh Mela 2025: కుంభమేళాపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్
- కుంభమేళా పై ప్రచారం అవుతున్న తప్పుడు సమాచారం.
- చలితీవ్రత తట్టుకోలేక 11 మంది మరణించారని తప్పుడు సమాచారం.
- విషయంపై యూపీ సీఎం సిరీస్.
- అలాంటి వారిపై కఠిన చర్యలంటూ తప్పవంటూ వార్నింగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela 2025: ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసే వారిపై యోగి ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. కుంభమేళా నేపథ్యంలో చలితీవ్రత తట్టుకోలేక 11 మంది మరణించారని, చలిని తట్టుకోలేక చాలామంది ఆస్పత్రి పాలవుతున్నారని, అలాగే అక్కడి అధికారులు పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన లలూ యాదవ్ సంజీవ్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు సంజీవ్ సమాజ్వాదీ పార్టీకి చెందిన కార్యకర్తగా చెప్పుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: Sankranthiki Vasthunam: బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న వెంకి మామ
Also Read
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Bathroom Cleaning Tips: కుళాయిలు, సింక్లు కొత్తవిగా మెరవాలంటే.. ఈ చిట్కాలతో నిమిషాల్లో కొత్త మెరుపు!
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. కుంభమేళాపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అశాంతి, అలజడికి కారణమయ్యే ఎటువంటి చర్యలకు ప్రభుత్వం సహనంగా ఉండదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి లక్నోలో నైట్ షెల్టర్ను సందర్శించి.. అక్కడ చలిలో బాధపడుతున్న వారికి దుప్పట్లు, స్వెటర్లను పంపిణీ చేశారు.
Also Read: Gaza Ceasefire: ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన భారత్
ఇక నేటితో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో జరుగుతున్న కుంభమేళా నాలుగో రోజుకు చేరుకుంది. భక్తులు, సాధువుల రద్దీతో కిటకిటలాడుతున్న ఈ ఉత్సవాన్ని కోట్లాదిమంది ప్రజలు సందర్శిస్తున్నారు. కుంభమేళాకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ముఖ్యంగా కుంభమేళా ప్రాంగణంలో వైద్య శిబిరాలు 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయని, అస్వస్థతకు గురైన భక్తులకు వెంటనే వైద్యం అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. కుంభమేళా సందర్భంగా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా పర్యవేక్షణ జరుగుతుందని యోగి ప్రభుత్వం తెలియజేసింది. భక్తుల శ్రేయస్సు కోసం ప్రతి చర్య తీసుకుంటున్నామని, తప్పుడు ప్రచారాలను సహించబోమని ప్రభుత్వం హెచ్చరించింది.
తాజావార్తలు
-
AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
-
Gold & Silver Prices Today: ఇలా అయితే కొనేదెట్టా.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
-
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
-
TheParadise : నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?
-
AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం…
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!