Uttam Kumar Reddy: కేసీఆర్ హయాంలోనే నీళ్ల దోపిడీ
రాష్ట్రంలో నీళ్ల పంచాయితీ మళ్లీ మొదలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత మొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టుల విషయంపై అధికార పార్టీ, బీఆర్ఎస్ నాయకులు రాళ్లు రువ్వుకున్నారు. తప్పు మీదంటే.. మీదంటూ ఒకరినోకరు విమర్శించుకున్నారు. స్వేత పత్రాలు సైతం విడుదల చేశారు. తాజాగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయంలో పోతిరెడ్డిపాడు నుంచి 92 వేల క్యూసెక్కుల నీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకుందన్నారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కంటే ఎక్కువ నీరు దోపిడీ జరిగిందని తెలిపారు. కేసీఆర్ ను, జగన్ కలిసిన ప్రతి సారి తెలంగాణకి అన్యాయం జరిగిందని ఆరోపించారు. 2014 కి ముందు శ్రీశైలం నుంచి ఆంధ్రాకి రోజుకు 4.1 టీఎంసీలు వెళ్ళేదన్నారు. 2014 తరువాత 9.5 టీఎంసీలకు పెరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి దోపిడీ జరిగిందని.. కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారన్నారు. మేము అధికారిక వివరాలు బయట పెడుతున్నాం.. కేసీఆర్ తెలివి మీరి మట్లాడుతున్నారన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కింకి వాటర్ సోర్స్ ఫైనల్ చేయనే లేదని తెలిపారు. ఈ టర్మ్ లో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ వల్ల నల్గొండకు జరిగిన అన్యాయాన్ని తాము సెట్ చేస్తామన్నారు.
READ MORE: congress: మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. వారెవరంటే?
Also Read
- Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
- AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..
- Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
ఎస్ఎల్ బీసీ(SLbc) టన్నెల్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కేఆర్ఎంబీ ని(Krmb) ని మీరు అప్పగిస్తే.. మేము కొట్లాడుతున్నామన్నారు. లిఖిత పూర్వకంగా అప్పగించింది మీరు.. కొట్లాడుతుంది తామని తెలిపారు. కేఆర్ఎమ్ బీకి ప్రాజెక్టులు అప్పగిస్తూ.. 2023 డిసెంబర్ 1న స్మితా సబర్వాల్ లేఖ రాశారని వెల్లడించారు. కేసీఆర్.. ఇంజనీర్ ఆయనే.. క్వాలిటీ కంట్రోల్ ఆయనే.. అందుకే మేడిగడ్డ పరిస్థితి అట్లుందని విమర్శించారు. కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు మాట్లాడే మాటలన్నీ అబద్ధాలన్నారు. బీఆర్ఎస్ కోలాప్స్ అయ్యే పరిస్థితిలో ఉందని.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదన్నారు.
తాజావార్తలు
-
Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
-
Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
-
TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
-
Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!
-
AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!