Uttam Kumar Reddy: కేసీఆర్ హయాంలోనే నీళ్ల దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో నీళ్ల పంచాయితీ మళ్లీ మొదలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత మొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టుల విషయంపై అధికార పార్టీ, బీఆర్ఎస్ నాయకులు రాళ్లు రువ్వుకున్నారు. తప్పు మీదంటే.. మీదంటూ ఒకరినోకరు విమర్శించుకున్నారు. స్వేత పత్రాలు సైతం విడుదల చేశారు. తాజాగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయంలో పోతిరెడ్డిపాడు నుంచి 92 వేల క్యూసెక్కుల నీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకుందన్నారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కంటే ఎక్కువ నీరు దోపిడీ జరిగిందని తెలిపారు. కేసీఆర్ ను, జగన్ కలిసిన ప్రతి సారి తెలంగాణకి అన్యాయం జరిగిందని ఆరోపించారు. 2014 కి ముందు శ్రీశైలం నుంచి ఆంధ్రాకి రోజుకు 4.1 టీఎంసీలు వెళ్ళేదన్నారు. 2014 తరువాత 9.5 టీఎంసీలకు పెరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి దోపిడీ జరిగిందని.. కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారన్నారు. మేము అధికారిక వివరాలు బయట పెడుతున్నాం.. కేసీఆర్ తెలివి మీరి మట్లాడుతున్నారన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కింకి వాటర్ సోర్స్ ఫైనల్ చేయనే లేదని తెలిపారు. ఈ టర్మ్ లో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ వల్ల నల్గొండకు జరిగిన అన్యాయాన్ని తాము సెట్ చేస్తామన్నారు.
READ MORE: congress: మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. వారెవరంటే?
Also Read
- Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
- Astrology: జూలై 22 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
ఎస్ఎల్ బీసీ(SLbc) టన్నెల్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కేఆర్ఎంబీ ని(Krmb) ని మీరు అప్పగిస్తే.. మేము కొట్లాడుతున్నామన్నారు. లిఖిత పూర్వకంగా అప్పగించింది మీరు.. కొట్లాడుతుంది తామని తెలిపారు. కేఆర్ఎమ్ బీకి ప్రాజెక్టులు అప్పగిస్తూ.. 2023 డిసెంబర్ 1న స్మితా సబర్వాల్ లేఖ రాశారని వెల్లడించారు. కేసీఆర్.. ఇంజనీర్ ఆయనే.. క్వాలిటీ కంట్రోల్ ఆయనే.. అందుకే మేడిగడ్డ పరిస్థితి అట్లుందని విమర్శించారు. కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు మాట్లాడే మాటలన్నీ అబద్ధాలన్నారు. బీఆర్ఎస్ కోలాప్స్ అయ్యే పరిస్థితిలో ఉందని.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదన్నారు.
తాజావార్తలు
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Team India: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. శ్రీలంక టెస్టు సిరీస్కు స్టార్ ప్లేయర్ డౌటే!
-
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
-
Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
-
CKYC: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్.. మీ CKYC నంబర్ తెలుసా?.. ఇలా తెలుసుకోండి
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!