Uttam Kumar Reddy : లిస్టు తుది జాబితా కాదు.. అది కేవలం వెరిఫికేషన్ కోసమే
- ప్రభుత్వంపై కావాలనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
- ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి
- రేషన్ కార్డుల విషయంలో ఎవరికీ ఆందోళన అవసరం లేదు : మంత్రి ఉత్తమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై కావాలనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. రేషన్ కార్డుల విషయంలో ఎవరికీ ఆందోళన అవసరం లేదని, చివరి లబ్ధిదారుడి వరకు రేషన్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 40,000 రేషన్ కార్డులు మాత్రమే జారీ చేసిందని, అయితే తమ ప్రభుత్వం లక్షల్లో కార్డులు ఇవ్వబోతుందన్నారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న లిస్టు తుది జాబితా కాదని, అది కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ నిరంతరం కొనసాగుతుందని, దరఖాస్తుల పరిశీలన ఐదేళ్ల పాటు జరుగుతుందని వివరించారు.
Also Read
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
- Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
- AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
Uber And Ola: “ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు వేర్వేరు ధరలు”.. ఉబర్, ఓలాకు కేంద్రం నోటీసులు..
కృష్ణా జలాల విషయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, మన హక్కుల్ని ఇతరులకు అప్పగించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి, ప్రజలకు వాస్తవాలు వివరించాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు.
ఈనెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని, అర్హులందరికీ అందే వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి ప్రకటించారు. సామాజిక ఆర్థిక సర్వే, ప్రజా పాలన దరఖాస్తులు, కులగణన, అలాగే గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అందిన దరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
Buddha Venkanna: టీడీపీకి దశ, దిశ లోకేష్ మాత్రమే.. చంద్రబాబు తర్వాత ఆయనే సీఎం..
తాజావార్తలు
-
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
-
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
-
Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?