Uttam Kumar Reddy: రూ.50 వేల కోట్ల స్కాం ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy: ఇండస్ట్రియల్ పాలసీపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. పాలసీ అర్థం కాక చేస్తున్నారా..? కావాలని చేస్తున్నారో అర్థం కావడం లేదు.. ఆకస్మికంగా తెచ్చిన పాలసీ కూడా కాదని తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అతి పెద్ద విద్యుత్ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు నిన్న(బుధవారం) ఆరోపించారు. రామగుండం, పాల్వంచ, మక్తల్లలో మూడు కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లను నిర్మించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం వెనుక.. దాదాపు రూ.50 వేల కోట్ల స్కాం దాగి ఉందని ఆరోపణలు చేశారు. ఈ అంశంపై తాజాగా మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడారు.
READ MORE: Devineni Avinash: జగన్ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా.. విజయవతం చేయడంలో మేమే ఫస్ట్..!
Also Read
ఢిల్లీలో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది.. ప్రజలు నివసించే పరిస్థితి కూడా లేదు.. హైదరాబాద్కి అలాంటి పరిస్థితి రావద్దు.. పొల్యూషన్ ఫ్రీ చేయాలని ఆలోచన చేసినట్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.. “కుంభకోణం అనేది అవాస్తవం.. ఇండస్ట్రీ లను ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉండాలి అని మా ఆలోచన.. అధికారులు, పారిశ్రామిక వేత్తలు, పర్యావరణ వేత్తలతో మాట్లాడి తీసుకున్న పాలసీ ఇది.. పారదర్శకంగా తీసుకువచ్చిన పాలసీ ఇది.. ఓ పెద్ద మనిషి మేము వస్తే పాలసీ మారుస్తాం అంటున్నారు.. మీరు అధికారంలోకి వచ్చేది లేదు.. రద్దు చేసేది లేదు.. పారిశ్రామిక వేత్తలకు అప్పీల్ చేస్తున్నా.. పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తీసుకెళ్లండి.. కొత్త పాలసీని ఉపయోగించుకోండి.. కాంగ్రెస్ ఏం చేసినా బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తుంది.. బద్నాం చేయాలని డిసైడ్ అయ్యింది. విద్యుత్తులో 50 వేల కోట్ల కుంభకోణం అని ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఐదు రూపాయల అవినీతి కూడా లేదు.. థర్మల్ పవర్ ప్లాంట్స్ పెట్టింది ఎవరు.. బీఆర్ఎస్ కాదా..? NTPC ద్వారా 4 వేల కోట్లతో పవర్ ప్లాంట్ పెడతాం అని వస్తే…ఎందుకు పూర్తి చేయలేదో చెప్పండి.. మీరు చేసిన కక్కుర్తి కి మమ్మల్ని అంటే ఎలా? భద్రాచలంలో సబ్ క్రిటికల్ ప్లాంట్ ఎందుకు పెట్టారు..? కేంద్రం సబ్ క్రిటికల్ ప్లాంట్స్ వద్దు అన్నా… పెట్టింది ఎవరు..?” అని మంత్రి ప్రశ్నించారు.
READ MORE: ED Raids: మెడికల్ కాలేజీ అనుమతుల కోసం లంచాలు.. దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఈడీ రైడ్స్..
తాజావార్తలు
-
Vishal: నేను బ్యాక్బెంచర్నే.. మా బ్యాచ్లో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, మరొకరు మాజీ మంత్రి..
-
Big Offer: శాంసంగ్ నుంచి బంపర్ ఆఫర్.. ఆ ఫోన్పై ఏకంగా రూ.37 వేలు డిస్కౌంట్..
-
Bangladesh: బంగ్లాదేశ్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
-
Anupama Parameswaran: బ్రేకప్ గురించి ఫస్ట్ టైం మాట్లాడిన అనుపమ.. ఆ రిలేషన్షిప్ ఎంతో బాధించిందట!
-
Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!