Twitter: వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ హస్తగతమైన మరుక్షణం నుంచే ఎలాన్ మస్క్ తన ప్రతాపం చూపడం మొదలుపెట్టడంతో యూజర్ల నుంచి ఉద్యోగుల వరకు అందరిలో అనిశ్చితి నెలకొంది. కొంతకాలంగా ట్విట్టర్ సంస్థలో తీవ్రమైన గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అందులో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగం ఉంటుందో ఉండదో అన్న భయాందోళనలో నెట్టుకొస్తున్నారు. ఇదంతా ఎందుకు.. ఇక ఏదైతే అదైందని మూకుమ్మడి రాజీనామాలను చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ చిక్కిన తర్వాత సంస్థలో సగం మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు, బ్లూటిక్ కోసం డబ్బులు వసూలు చేస్తామన్న ప్రకటన యూజర్లను అయోమయానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్విట్టర్ ఉద్యోగులు కొందరు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ఇక కోలుకోలేదని వినియోగదారులు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Meet Cute: నాని సోదరి ఆంథాలజీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
తాజాగా, ఉద్యోగులు రోజుకు 12 గంటలపాటు పనిచేయాల్సిందేనని మస్క్ అల్టిమేటం జారీ చేయడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ట్విట్టర్ను వీడుతున్నారు. ఉద్యోగాలకు సామూహికంగా రాజీనామాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పలుచోట్ల ఉద్యోగులు లేక ట్విట్టర్ కార్యాలయాలు మూతపడ్డాయి. ఈ పరిణామాలపై మస్క్ స్పందించారు. “పోతే పోనివ్వండి… అంతకు రెట్టింపు సంఖ్యలో ఉద్యోగులు వెళ్లిపోయినా నేను ఏమాత్రం బాధపడను. మాకు నైపుణ్యం ఉన్న ఉద్యోగులు మిగులుతారు” అని వివరణ ఇచ్చారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు మస్క్ పైవిధంగా బదులిచ్చారు. ఇక, ట్విట్టర్ను మూసివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాంతో పలువురు నెటిజన్లు బాధతో స్పందిస్తున్నారు. ట్విట్టర్ ఫాలోవర్లను మిస్ అవుతామంటూ భావోద్వేగాలతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరు ‘Rip Twitter’ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.