US – Iran Tensions: ఇరాన్పై దాడికి అమెరికా ప్లాన్.. దాడి చేసేది ఇక్కడి నుంచే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US – Iran Tensions: ఇరాన్పై యుద్ధానికి అమెరికా ప్లాన్ చేస్తుంది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య అగ్రదేశం ఖతార్లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో తన సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. రాయిటర్స్ నివేదికల ప్రకారం.. ఈ వైమానిక స్థావరంలో తాజాగా అమెరికా యుద్ధ విమానాల కదలిక పెరిగింది. అంతే కాకుండా, ఇరాన్లో నివసిస్తున్న తన పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని అమెరికా ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్లో కొనసాగుతున్న నిరసనలు, ప్రాంతీయ అస్థిరత మధ్య అమెరికా తాజా హెచ్చరిక సంచలనంగా మారింది.
READ ALSO: Mobile Charging Tips: దిండ్లు, దిప్పట్లపై మొబైల్ను పెడుతున్నారా?.. డేంజర్ జోన్లో ఉన్నట్లే!
Also Read
- PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ప్రత్యేకతలు..
ఖతార్ రాజధాని దోహాకు నైరుతి దిశలో దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా వైమానిక స్థావరం.. అల్ ఉదీద్ వైమానిక స్థావరం. ఇది మధ్యప్రాచ్యంలో అతిపెద్ద US సైనిక స్థావరం. ఇందులో10 వేల కంటే ఎక్కువ మంది US సైనికులకు నివాసంగా ఉంది. ఈ స్థావరంలో B-52 వ్యూహాత్మక బాంబర్లు, KC-135 వైమానిక ఇంధనం నింపే ట్యాంకర్లు, రవాణా విమానాలు వంటి పెద్ద విమానాలను నిర్వహించగల 4,500 మీటర్ల పొడవైన రన్వే ఉంది. ఇది US సెంట్రల్ కమాండ్ (CENTCOM) యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఇరాన్ సరిహద్దు నుంచి కేవలం 200-300 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
ఇజ్రాయెల్ మీడియా నివేదికల ప్రకారం.. జనవరి 12, 2026న అనేక US విమానాలు అల్ ఉదీద్ నుంచి బయలుదేరాయి. వాటిలో KC-135 వైమానిక ఇంధనం నింపే ట్యాంకర్లు, B-52 వ్యూహాత్మక బాంబర్లు కూడా ఉన్నాయి. ఓపెన్ – సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT), ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. KC-135, KC-46A పెగాసస్ ట్యాంకర్, C-17 గ్లోబ్మాస్టర్ III, C-5M గెలాక్సీ వంటి భారీ రవాణా విమానాలు మధ్యప్రాచ్యానికి వెళుతున్నాయని చెప్పింది. ఇరాన్లో నిరసనల మధ్య ఈ వైమానిక స్థావరంలో అమెరికా సైనిక కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి.
అమెరికా హెచ్చరికలకు అర్థం ఏంటి..
ఇరాన్లోని US వర్చువల్ ఎంబసీ జనవరి 12, 2026న ఒక హెచ్చరిక జారీ చేసింది. US పౌరులు ఇరాన్కు ప్రయాణించకూడదని, ఎవరైనా ఇరాన్లో ఉంటే వెంటనే దేశం నుంచి వెళ్లిపోవాలని ఈ హెచ్చరికలో అగ్రరాజ్యం పేర్కొంది. ఇదే టైంలో ఇరాన్లో నెలకొన్న అశాంతి కారణంగా, అవసరమైతే తక్షణ చర్య తీసుకోవడానికి అమెరికా తన సైనిక సంసిద్ధతను పెంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చర్య ఇరాన్ అణు కార్యక్రమం, క్షిపణులు, ప్రాంతీయ అస్థిరతకు ముడిపడి ఉంది. అల్ ఉదీద్ స్థావరం మధ్యప్రాచ్యంలో అమెరికా శక్తికి చిహ్నంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ పెరిగిన సైనిక కార్యకలాపాలు, అగ్రరాజ్యం హెచ్చరికలు ఇరాన్పై అమెరికా దాడి చేస్తుందనే సంకేతాలను ఇస్తుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Quick Commerce: ఇకపై నో 10 మినిట్స్ డెలివరీ.. డెలివరీ బాయ్స్కు కేంద్రం గుడ్ న్యూస్
తాజావార్తలు
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
-
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
-
SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!