US: బెడ్ రూమ్లో నిద్రిస్తున్న అధ్యక్షుడిని ఈడ్చుకెళ్లారు.. ఆపరేషన్ వివరాలు పంచుకున్న యూఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US: అమెరికా సైన్యం వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను అర్ధరాత్రి మెరుపు దాడి చేసి అదుపులోకి తీసుకుంది. కారకాస్లోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ టియూనా సైనిక స్థావరంలోని వారి నివాసంలో నిద్రిస్తున్న సమయంలో ఈడ్చుకెళ్లారు. అమెరికా డెల్టా ఫోర్స్ ప్రత్యేక దళాలు, ఎఫ్బీఐ సహకారంతో ఇంట్లోకి చొరబడి 30 నిమిషాల్లోపే మడురో దంపతులను బయటకు తీసుకెళ్లాయి. ఈ దాడిలో అమెరికా సైనికులకు ప్రాణనష్టం జరగలేదని వాషింగ్టన్ ప్రకటించింది. కొంతమంది సైనికులు గాయపడ్డారని, కానీ వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. “మడురో ఒక కోటలో ఉన్నాడు. అక్కడి నుంచి అతడిని బయటకు తీయడం పెద్ద ఆపరేషన్. అయినా మా వైపు ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడం ఆశ్చర్యం,” అని ట్రంప్ ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో చెప్పారు.
READ MORE: Crime News: ఛీ.. ఛీ.. ఇంత క్రూరంగా ఎలా..? 82 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. చివరకు..?
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడి సమయంలో కారకాస్ నగరంలో పలు పేలుళ్లు వినిపించాయని స్థానికులు చెప్పారు. కనీసం ఏడు భారీ శబ్దాలు వినిపించాయని, బహుశా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో కొంతమంది పౌరులు, సైనికులు మరణించినట్లు వెనిజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ వెల్లడించారు. అయితే మృతుల సంఖ్యను ఆమె వెల్లడించలేదు. మడురో దంపతులను వెనిజువెలా నుంచి బయటకు తీసుకెళ్లిన అనంతరం, అమెరికాలో నార్కో ఉగ్రవాదం కేసులపై విచారణ ఎదుర్కొననున్నారని అమెరికా అధికారులు తెలిపారు. డ్రగ్ అక్రమ రవాణాకు సంబంధించిన నేరాలకు మడురో నేతృత్వంలో పెద్ద నేరగాళ్ల నెట్వర్క్ పనిచేస్తోందని అమెరికా చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఈ కేసులు 2020లోనే అధికారికంగా నమోదు అయ్యాయి. ఈ దాడి తర్వాత వెనిజువెలా పాలనను తాత్కాలికంగా అమెరికా పరిపాలన తన చేతుల్లోకి తీసుకుంటుందని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని చెప్పారు. ఈ అంశంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఆపరేషన్కు ముందు మడురోకు పలు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. డ్రగ్ రవాణా ఆగాలి, అక్రమంగా సంపాదించిన చమురు అమెరికాకు తిరిగి ఇవ్వాలి అనే విషయంపై అధ్యక్షుడు స్పష్టంగా వివరించారన్నారు. హెచ్చరికలు పట్టించుకోకపోవడంతోనే చివరికి ఈ సైనిక చర్య చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?