US: బెడ్ రూమ్లో నిద్రిస్తున్న అధ్యక్షుడిని ఈడ్చుకెళ్లారు.. ఆపరేషన్ వివరాలు పంచుకున్న యూఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US: అమెరికా సైన్యం వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను అర్ధరాత్రి మెరుపు దాడి చేసి అదుపులోకి తీసుకుంది. కారకాస్లోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ టియూనా సైనిక స్థావరంలోని వారి నివాసంలో నిద్రిస్తున్న సమయంలో ఈడ్చుకెళ్లారు. అమెరికా డెల్టా ఫోర్స్ ప్రత్యేక దళాలు, ఎఫ్బీఐ సహకారంతో ఇంట్లోకి చొరబడి 30 నిమిషాల్లోపే మడురో దంపతులను బయటకు తీసుకెళ్లాయి. ఈ దాడిలో అమెరికా సైనికులకు ప్రాణనష్టం జరగలేదని వాషింగ్టన్ ప్రకటించింది. కొంతమంది సైనికులు గాయపడ్డారని, కానీ వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. “మడురో ఒక కోటలో ఉన్నాడు. అక్కడి నుంచి అతడిని బయటకు తీయడం పెద్ద ఆపరేషన్. అయినా మా వైపు ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడం ఆశ్చర్యం,” అని ట్రంప్ ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో చెప్పారు.
READ MORE: Crime News: ఛీ.. ఛీ.. ఇంత క్రూరంగా ఎలా..? 82 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. చివరకు..?
Also Read
- Sheikh Hasina: నన్ను చంపినా.. అరెస్ట్ చేసినా బంగ్లాదేశ్కు వెళ్తా.. షేక్ హసీనా కీలక ప్రకటన
- Supreme Court: కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్.. పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతులకు బ్రేక్
- Pawan Kalyan: జనసేన పార్టీ కీలక నిర్ణయం.. ఆ 26 మంది అవుట్!
- Manmohan Singh: కోల్ స్కామ్ కేసులో సంచలన తీర్పు.. దివంగత మాజీ ప్రధానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్!
శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడి సమయంలో కారకాస్ నగరంలో పలు పేలుళ్లు వినిపించాయని స్థానికులు చెప్పారు. కనీసం ఏడు భారీ శబ్దాలు వినిపించాయని, బహుశా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో కొంతమంది పౌరులు, సైనికులు మరణించినట్లు వెనిజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ వెల్లడించారు. అయితే మృతుల సంఖ్యను ఆమె వెల్లడించలేదు. మడురో దంపతులను వెనిజువెలా నుంచి బయటకు తీసుకెళ్లిన అనంతరం, అమెరికాలో నార్కో ఉగ్రవాదం కేసులపై విచారణ ఎదుర్కొననున్నారని అమెరికా అధికారులు తెలిపారు. డ్రగ్ అక్రమ రవాణాకు సంబంధించిన నేరాలకు మడురో నేతృత్వంలో పెద్ద నేరగాళ్ల నెట్వర్క్ పనిచేస్తోందని అమెరికా చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఈ కేసులు 2020లోనే అధికారికంగా నమోదు అయ్యాయి. ఈ దాడి తర్వాత వెనిజువెలా పాలనను తాత్కాలికంగా అమెరికా పరిపాలన తన చేతుల్లోకి తీసుకుంటుందని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని చెప్పారు. ఈ అంశంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఆపరేషన్కు ముందు మడురోకు పలు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. డ్రగ్ రవాణా ఆగాలి, అక్రమంగా సంపాదించిన చమురు అమెరికాకు తిరిగి ఇవ్వాలి అనే విషయంపై అధ్యక్షుడు స్పష్టంగా వివరించారన్నారు. హెచ్చరికలు పట్టించుకోకపోవడంతోనే చివరికి ఈ సైనిక చర్య చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Sheikh Hasina: నన్ను చంపినా.. అరెస్ట్ చేసినా బంగ్లాదేశ్కు వెళ్తా.. షేక్ హసీనా కీలక ప్రకటన
-
Chicken Biryani: ప్రభుత్వ స్కూళ్లలో చికెన్ బిర్యానీ? సర్కార్ కొత్త ఆలోచన!
-
Allu Arjun : అల్లు అర్జున్ హిత బోధ వెనుక కారణం ఇదా?
-
Supreme Court: కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్.. పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతులకు బ్రేక్
-
Pawan Kalyan: జనసేన పార్టీ కీలక నిర్ణయం.. ఆ 26 మంది అవుట్!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!