US: బెడ్ రూమ్లో నిద్రిస్తున్న అధ్యక్షుడిని ఈడ్చుకెళ్లారు.. ఆపరేషన్ వివరాలు పంచుకున్న యూఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US: అమెరికా సైన్యం వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను అర్ధరాత్రి మెరుపు దాడి చేసి అదుపులోకి తీసుకుంది. కారకాస్లోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ టియూనా సైనిక స్థావరంలోని వారి నివాసంలో నిద్రిస్తున్న సమయంలో ఈడ్చుకెళ్లారు. అమెరికా డెల్టా ఫోర్స్ ప్రత్యేక దళాలు, ఎఫ్బీఐ సహకారంతో ఇంట్లోకి చొరబడి 30 నిమిషాల్లోపే మడురో దంపతులను బయటకు తీసుకెళ్లాయి. ఈ దాడిలో అమెరికా సైనికులకు ప్రాణనష్టం జరగలేదని వాషింగ్టన్ ప్రకటించింది. కొంతమంది సైనికులు గాయపడ్డారని, కానీ వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. “మడురో ఒక కోటలో ఉన్నాడు. అక్కడి నుంచి అతడిని బయటకు తీయడం పెద్ద ఆపరేషన్. అయినా మా వైపు ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడం ఆశ్చర్యం,” అని ట్రంప్ ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో చెప్పారు.
READ MORE: Crime News: ఛీ.. ఛీ.. ఇంత క్రూరంగా ఎలా..? 82 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. చివరకు..?
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడి సమయంలో కారకాస్ నగరంలో పలు పేలుళ్లు వినిపించాయని స్థానికులు చెప్పారు. కనీసం ఏడు భారీ శబ్దాలు వినిపించాయని, బహుశా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో కొంతమంది పౌరులు, సైనికులు మరణించినట్లు వెనిజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ వెల్లడించారు. అయితే మృతుల సంఖ్యను ఆమె వెల్లడించలేదు. మడురో దంపతులను వెనిజువెలా నుంచి బయటకు తీసుకెళ్లిన అనంతరం, అమెరికాలో నార్కో ఉగ్రవాదం కేసులపై విచారణ ఎదుర్కొననున్నారని అమెరికా అధికారులు తెలిపారు. డ్రగ్ అక్రమ రవాణాకు సంబంధించిన నేరాలకు మడురో నేతృత్వంలో పెద్ద నేరగాళ్ల నెట్వర్క్ పనిచేస్తోందని అమెరికా చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఈ కేసులు 2020లోనే అధికారికంగా నమోదు అయ్యాయి. ఈ దాడి తర్వాత వెనిజువెలా పాలనను తాత్కాలికంగా అమెరికా పరిపాలన తన చేతుల్లోకి తీసుకుంటుందని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని చెప్పారు. ఈ అంశంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఆపరేషన్కు ముందు మడురోకు పలు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. డ్రగ్ రవాణా ఆగాలి, అక్రమంగా సంపాదించిన చమురు అమెరికాకు తిరిగి ఇవ్వాలి అనే విషయంపై అధ్యక్షుడు స్పష్టంగా వివరించారన్నారు. హెచ్చరికలు పట్టించుకోకపోవడంతోనే చివరికి ఈ సైనిక చర్య చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!