Urvil Patel: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉర్విల్ ఊచకోత..
- మంచి ఫామ్లో ఉన్న గుజరాత్ బ్యాట్స్మెన్ ఉర్విల్ పటేల్
- వారం వ్యవధిలోనే మరో సెంచరీ
- ఉత్తరాఖండ్పై కేవలం 36 బంతుల్లోనే శతకం
- 41 బంతుల్లో అజేయంగా 115 పరుగులు చేసిన ఉర్విల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ బ్యాట్స్మెన్ ఉర్విల్ పటేల్ మంచి ఫామ్లో ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో వారం వ్యవధిలోనే మరో సెంచరీ సాధించాడు. మంగళవారం ఉత్తరాఖండ్పై కేవలం 36 బంతుల్లోనే శతకం బాదాడు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పటేల్ 41 బంతుల్లో అజేయంగా 115 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. స్ట్రైక్ రేట్ 280.48తో చెలరేగాడు. ఉర్విల్ పటేల్ ఇంతకుముందు త్రిపురపై కేవలం 28 బంతుల్లోనే టీ20 సెంచరీ సాధించాడు. కాగా.. శతకాలు బాదుతున్న ఉర్విల్ పటేల్ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ అతనిని కొనుగోలు చేయలేదు. దీంతో.. ఇప్పుడు ఫ్రాంచైజీలు ఎంత మంచి బ్యాటర్ను కోల్పోయమంటూ బాధపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఉత్తరాఖండ్ బ్యాటింగ్లో రవికుమార్ సమర్థ్ (54), ఆదిత్య తారే (54), కునాల్ చండేలా (43) పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఉర్విల్ పటేల్ అజేయ సెంచరీతో 41 బంతులు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో గుజరాత్ 13.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Also Read
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
- Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
Read Also: iQOO 13 Price: ‘ఐకూ 13’ ఫోన్ వచ్చేసింది.. 50 ఎంపీతో మూడు కెమెరాలు, 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ!
మరోవైపు.. ఉర్విల్ పటేల్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ ప్రత్యేక క్లబ్లో చోటు సంపాదించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎడిషన్లో రెండు సెంచరీలు చేసిన ఏడో బ్యాట్స్మెన్గా ఉర్విల్ పటేల్ నిలిచాడు. గతేడాది పంజాబ్కు చెందిన అభిషేక్ శర్మ ఈ ఘనత సాధించాడు. SMAT ఒక ఎడిషన్లో రెండు సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్లు ఎవరెవరు ఉన్నారంటే…
ఉన్ముక్త్ చంద్, ఢిల్లీ, 2013
కరుణ్ నాయర్, కర్ణాటక, 2018
ఇషాన్ కిషన్, జార్ఖండ్, 2019
శ్రేయాస్ అయ్యర్, ముంబై, 2019
రుతురాజ్ గైక్వాడ్, మహారాష్ట్ర, 2022
అభిషేక్ శర్మ, పంజాబ్, 2023
ఉర్విల్ పటేల్, గుజరాత్, 2024*
ఉర్విల్ పటేల్ ఉత్తరాఖండ్పై సెంచరీ చేయడంతో మరో రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్లో నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్మెన్గా ఉర్విల్ పటేల్ నిలిచాడు. దీంతో.. భారత మాజీ ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్ రికార్డును బద్దలు కొట్టాడు. 2010లో ముంబై ఇండియన్స్పై పఠాన్ 37 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఉర్విల్ పటేల్ 36 బంతుల్లో సెంచరీ సాధించి రికార్డు బ్రేక్ చేశాడు.
తాజావార్తలు
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?