Urvil Patel: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉర్విల్ ఊచకోత..
- మంచి ఫామ్లో ఉన్న గుజరాత్ బ్యాట్స్మెన్ ఉర్విల్ పటేల్
- వారం వ్యవధిలోనే మరో సెంచరీ
- ఉత్తరాఖండ్పై కేవలం 36 బంతుల్లోనే శతకం
- 41 బంతుల్లో అజేయంగా 115 పరుగులు చేసిన ఉర్విల్.
గుజరాత్ బ్యాట్స్మెన్ ఉర్విల్ పటేల్ మంచి ఫామ్లో ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో వారం వ్యవధిలోనే మరో సెంచరీ సాధించాడు. మంగళవారం ఉత్తరాఖండ్పై కేవలం 36 బంతుల్లోనే శతకం బాదాడు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పటేల్ 41 బంతుల్లో అజేయంగా 115 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. స్ట్రైక్ రేట్ 280.48తో చెలరేగాడు. ఉర్విల్ పటేల్ ఇంతకుముందు త్రిపురపై కేవలం 28 బంతుల్లోనే టీ20 సెంచరీ సాధించాడు. కాగా.. శతకాలు బాదుతున్న ఉర్విల్ పటేల్ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ అతనిని కొనుగోలు చేయలేదు. దీంతో.. ఇప్పుడు ఫ్రాంచైజీలు ఎంత మంచి బ్యాటర్ను కోల్పోయమంటూ బాధపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఉత్తరాఖండ్ బ్యాటింగ్లో రవికుమార్ సమర్థ్ (54), ఆదిత్య తారే (54), కునాల్ చండేలా (43) పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఉర్విల్ పటేల్ అజేయ సెంచరీతో 41 బంతులు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో గుజరాత్ 13.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Read Also: iQOO 13 Price: ‘ఐకూ 13’ ఫోన్ వచ్చేసింది.. 50 ఎంపీతో మూడు కెమెరాలు, 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ!
మరోవైపు.. ఉర్విల్ పటేల్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ ప్రత్యేక క్లబ్లో చోటు సంపాదించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎడిషన్లో రెండు సెంచరీలు చేసిన ఏడో బ్యాట్స్మెన్గా ఉర్విల్ పటేల్ నిలిచాడు. గతేడాది పంజాబ్కు చెందిన అభిషేక్ శర్మ ఈ ఘనత సాధించాడు. SMAT ఒక ఎడిషన్లో రెండు సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్లు ఎవరెవరు ఉన్నారంటే…
ఉన్ముక్త్ చంద్, ఢిల్లీ, 2013
కరుణ్ నాయర్, కర్ణాటక, 2018
ఇషాన్ కిషన్, జార్ఖండ్, 2019
శ్రేయాస్ అయ్యర్, ముంబై, 2019
రుతురాజ్ గైక్వాడ్, మహారాష్ట్ర, 2022
అభిషేక్ శర్మ, పంజాబ్, 2023
ఉర్విల్ పటేల్, గుజరాత్, 2024*
ఉర్విల్ పటేల్ ఉత్తరాఖండ్పై సెంచరీ చేయడంతో మరో రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్లో నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్మెన్గా ఉర్విల్ పటేల్ నిలిచాడు. దీంతో.. భారత మాజీ ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్ రికార్డును బద్దలు కొట్టాడు. 2010లో ముంబై ఇండియన్స్పై పఠాన్ 37 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఉర్విల్ పటేల్ 36 బంతుల్లో సెంచరీ సాధించి రికార్డు బ్రేక్ చేశాడు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!