Urvil Patel: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉర్విల్ ఊచకోత..
- మంచి ఫామ్లో ఉన్న గుజరాత్ బ్యాట్స్మెన్ ఉర్విల్ పటేల్
- వారం వ్యవధిలోనే మరో సెంచరీ
- ఉత్తరాఖండ్పై కేవలం 36 బంతుల్లోనే శతకం
- 41 బంతుల్లో అజేయంగా 115 పరుగులు చేసిన ఉర్విల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ బ్యాట్స్మెన్ ఉర్విల్ పటేల్ మంచి ఫామ్లో ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో వారం వ్యవధిలోనే మరో సెంచరీ సాధించాడు. మంగళవారం ఉత్తరాఖండ్పై కేవలం 36 బంతుల్లోనే శతకం బాదాడు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పటేల్ 41 బంతుల్లో అజేయంగా 115 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. స్ట్రైక్ రేట్ 280.48తో చెలరేగాడు. ఉర్విల్ పటేల్ ఇంతకుముందు త్రిపురపై కేవలం 28 బంతుల్లోనే టీ20 సెంచరీ సాధించాడు. కాగా.. శతకాలు బాదుతున్న ఉర్విల్ పటేల్ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ అతనిని కొనుగోలు చేయలేదు. దీంతో.. ఇప్పుడు ఫ్రాంచైజీలు ఎంత మంచి బ్యాటర్ను కోల్పోయమంటూ బాధపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఉత్తరాఖండ్ బ్యాటింగ్లో రవికుమార్ సమర్థ్ (54), ఆదిత్య తారే (54), కునాల్ చండేలా (43) పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఉర్విల్ పటేల్ అజేయ సెంచరీతో 41 బంతులు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో గుజరాత్ 13.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Also Read
Read Also: iQOO 13 Price: ‘ఐకూ 13’ ఫోన్ వచ్చేసింది.. 50 ఎంపీతో మూడు కెమెరాలు, 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ!
మరోవైపు.. ఉర్విల్ పటేల్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ ప్రత్యేక క్లబ్లో చోటు సంపాదించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎడిషన్లో రెండు సెంచరీలు చేసిన ఏడో బ్యాట్స్మెన్గా ఉర్విల్ పటేల్ నిలిచాడు. గతేడాది పంజాబ్కు చెందిన అభిషేక్ శర్మ ఈ ఘనత సాధించాడు. SMAT ఒక ఎడిషన్లో రెండు సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్లు ఎవరెవరు ఉన్నారంటే…
ఉన్ముక్త్ చంద్, ఢిల్లీ, 2013
కరుణ్ నాయర్, కర్ణాటక, 2018
ఇషాన్ కిషన్, జార్ఖండ్, 2019
శ్రేయాస్ అయ్యర్, ముంబై, 2019
రుతురాజ్ గైక్వాడ్, మహారాష్ట్ర, 2022
అభిషేక్ శర్మ, పంజాబ్, 2023
ఉర్విల్ పటేల్, గుజరాత్, 2024*
ఉర్విల్ పటేల్ ఉత్తరాఖండ్పై సెంచరీ చేయడంతో మరో రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్లో నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్మెన్గా ఉర్విల్ పటేల్ నిలిచాడు. దీంతో.. భారత మాజీ ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్ రికార్డును బద్దలు కొట్టాడు. 2010లో ముంబై ఇండియన్స్పై పఠాన్ 37 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఉర్విల్ పటేల్ 36 బంతుల్లో సెంచరీ సాధించి రికార్డు బ్రేక్ చేశాడు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!