UPSC Exam video: నిమిషం లేటు.. గేటు ముందే భోరుమన్న తల్లిదండ్రులు
- ఆదివారం సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
- నిమిషం ఆలస్యంతో అభ్యర్థి తల్లిదండ్రుల ఆవేదన
- గేటు బయటే సొమ్మసిల్లిపడిపోయిన పేరెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు ప్రయోజకలు కావాలని.. ఉన్నత దశలో ఉండాలని కోరుకుంటారు. అంతేకాకుండా వారు తినకపోయినా.. పిల్లల కోసం సర్వం కోల్పోతుంటారు. ఇక జీవితంలో బిడ్డలు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరుకుంటారు. ఇక మరికొంత మంది ఐఏఎస్ కావాలనో.. లేదంటే ఐపీఎస్ కావాలనో కలలు కంటుంటారు. అందుకోసం నిరంతరం శ్రమిస్తుంటారు. ఆదివారం దేశ వ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. అయితే ఒక అభ్యర్థి నిమిషం లేటుగా ఎగ్జామ్ సెంటర్కు చేరుకుంది. దీంతో సిబ్బంది గేట్లు మూసేశారు. ఈ పరిణామంతో అభ్యర్థితో పాటు ఆమె తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. తమ బిడ్డ ఎగ్జామ్ రాయకుండా పోతుందన్న ఆవేదనతో గేటు ముందే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఎక్కి ఎక్కి ఏడుస్తూ అక్కడినే ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడ్నే ఉన్న కొంత మంది మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి కాస్త నెట్టింట వైరల్గా మారాయి.
ఆదివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఈ ప్రిలిమినరీ పరీక్ష కోసం గుర్గ్రామ్కు చెందిన దంపతులు తమ కుమార్తెను ఎగ్జామ్ సెంటర్కు తీసుకెళ్లారు. అయితే నిర్దేశించిన సమయానికి నిమిషం ఆలస్యమైన కారణంగా సదరు అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అధికారులు అనమతించలేదు. ఎగ్జామ్ సెంటర్లోకి ప్రవేశం కల్పించలేదు. ప్రాధేయపడినా అధికారులు కనికరించలేదు. దీంతో తమ కుమార్తె పడిన కష్టానికి ఫలితం దక్కే అవకాశం లేదని, మరో ఏడాది సమయం వృధా అవుతుందని యువతి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కన్నీరుమున్నీరయ్యారు. తల్లి అయితే ఏకంగా సొమ్మసిల్లి కిందపడిపోయింది. కళ్ల ఎదుటే తల్లిదండ్రులు ఈ విధంగా బాధపడుతుండడాన్ని చూసిన అభ్యర్థి ధైర్య తెచ్చుకొని తల్లిదండ్రులను ఓదార్చింది.
Also Read
- 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
- Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
మంచి నీళ్లు తాగు నాన్నా, వచ్చే సంవత్సరం రాయవచ్చు అమ్మా అంటూ ఆ అభ్యర్థి ఇద్దరికీ సముదాయించే ప్రయత్నం చేసింది. అయితే ఒక సంవత్సరం వృథాపోయిందంటూ తల్లిదండ్రులు ఇద్దరూ వాపోయారు. కూతురి కోసం తల్లిదండ్రులు ఆ విధంగా తల్లడిల్లిపోవడాన్ని చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారికి ధైర్యం చెబుతున్నారు.
Heartbreaking video.💔🥲
Condition of Parents who came along with their daughter for the UPSC Prelims exam today, as their daughter was not allowed for being late. Exam starts at 9: 30 am, and they were at the gate at 9 am but were not allowed in by the principal of S.D. Adarsh… pic.twitter.com/2yZuZlSqMZ— Sakshi (@333maheshwariii) June 16, 2024
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..