UPSC Exam video: నిమిషం లేటు.. గేటు ముందే భోరుమన్న తల్లిదండ్రులు
- ఆదివారం సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
- నిమిషం ఆలస్యంతో అభ్యర్థి తల్లిదండ్రుల ఆవేదన
- గేటు బయటే సొమ్మసిల్లిపడిపోయిన పేరెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు ప్రయోజకలు కావాలని.. ఉన్నత దశలో ఉండాలని కోరుకుంటారు. అంతేకాకుండా వారు తినకపోయినా.. పిల్లల కోసం సర్వం కోల్పోతుంటారు. ఇక జీవితంలో బిడ్డలు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరుకుంటారు. ఇక మరికొంత మంది ఐఏఎస్ కావాలనో.. లేదంటే ఐపీఎస్ కావాలనో కలలు కంటుంటారు. అందుకోసం నిరంతరం శ్రమిస్తుంటారు. ఆదివారం దేశ వ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. అయితే ఒక అభ్యర్థి నిమిషం లేటుగా ఎగ్జామ్ సెంటర్కు చేరుకుంది. దీంతో సిబ్బంది గేట్లు మూసేశారు. ఈ పరిణామంతో అభ్యర్థితో పాటు ఆమె తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. తమ బిడ్డ ఎగ్జామ్ రాయకుండా పోతుందన్న ఆవేదనతో గేటు ముందే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఎక్కి ఎక్కి ఏడుస్తూ అక్కడినే ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడ్నే ఉన్న కొంత మంది మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి కాస్త నెట్టింట వైరల్గా మారాయి.
ఆదివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఈ ప్రిలిమినరీ పరీక్ష కోసం గుర్గ్రామ్కు చెందిన దంపతులు తమ కుమార్తెను ఎగ్జామ్ సెంటర్కు తీసుకెళ్లారు. అయితే నిర్దేశించిన సమయానికి నిమిషం ఆలస్యమైన కారణంగా సదరు అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అధికారులు అనమతించలేదు. ఎగ్జామ్ సెంటర్లోకి ప్రవేశం కల్పించలేదు. ప్రాధేయపడినా అధికారులు కనికరించలేదు. దీంతో తమ కుమార్తె పడిన కష్టానికి ఫలితం దక్కే అవకాశం లేదని, మరో ఏడాది సమయం వృధా అవుతుందని యువతి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కన్నీరుమున్నీరయ్యారు. తల్లి అయితే ఏకంగా సొమ్మసిల్లి కిందపడిపోయింది. కళ్ల ఎదుటే తల్లిదండ్రులు ఈ విధంగా బాధపడుతుండడాన్ని చూసిన అభ్యర్థి ధైర్య తెచ్చుకొని తల్లిదండ్రులను ఓదార్చింది.
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
మంచి నీళ్లు తాగు నాన్నా, వచ్చే సంవత్సరం రాయవచ్చు అమ్మా అంటూ ఆ అభ్యర్థి ఇద్దరికీ సముదాయించే ప్రయత్నం చేసింది. అయితే ఒక సంవత్సరం వృథాపోయిందంటూ తల్లిదండ్రులు ఇద్దరూ వాపోయారు. కూతురి కోసం తల్లిదండ్రులు ఆ విధంగా తల్లడిల్లిపోవడాన్ని చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారికి ధైర్యం చెబుతున్నారు.
Heartbreaking video.💔🥲
Condition of Parents who came along with their daughter for the UPSC Prelims exam today, as their daughter was not allowed for being late. Exam starts at 9: 30 am, and they were at the gate at 9 am but were not allowed in by the principal of S.D. Adarsh… pic.twitter.com/2yZuZlSqMZ— Sakshi (@333maheshwariii) June 16, 2024
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!