UP: నలుగురు పిల్లల తల్లి ప్రియుడి కోసం.. భర్తకు టీలో ఎలుకల మందు కలిపి..
- నలుగురు పిల్లల తల్లి ప్రియుడి కోసం
- భర్తకు టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది
- 16 ఏళ్ల వివాహబంధానికి మరణశాసనం రాసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరాయి వ్యక్తులపై మోజు కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నాయి. ప్రియుడి మోజులో భర్తల ప్రాణాలు తీస్తున్నారు భార్యలు. దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో దారుణం వెలుగుచూసింది. ఉత్తర్ ప్రదేశ్ లో నలుగురు పిల్లల తల్లి ప్రియుడి కోసం భర్తకు టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. 16 ఏళ్ల వివాహబంధానికి మరణశాసనం రాసింది. అది తాగిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. భర్తకు విషమిచ్చి చంపిన భార్య హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. పోలీసులు ఆమెను ప్రియుడిని అరెస్ట్ చేశారు.
Also Read:Gurugram: ఐసీయూలో ఎయిర్ హోస్టెస్పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
రేఖ అనే వివాహిత కప్పు టీలో ఎలుకల మందు కలిపి తన భర్త కేహర్ సింగ్కు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె తన ప్రేమికుడు పింటును బరేలీలోని ఫతేగంజ్లోని తన ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి సింగ్ను గొంతు నులిమి చంపారు. ఆ తర్వాత వారు తాడుతో అతని బాడీని ఉరితీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. మరుసటి రోజు, రేఖ ఏడుపులతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. తన భర్త ఉరేసుకుని చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నంచేసింది.
Also Read:Kalyan Ram: ఇలాంటి సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదన్నాడు
వారు మృతదేహాన్ని కిందకు దించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం నివేదికలో గొంతు నులిమి చంపినట్లు స్పష్టంగా ఉందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (నార్త్) ముఖేష్ చంద్ర మిశ్రా తెలిపారు. బాధితురాలి సోదరుడు అశోక్ సింగ్ ఫిర్యాదు మేరకు ఆ మహిళ, ఆమె ప్రేమికుడిపై హత్య కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.
Also Read:Nani : సుజిత్ తో సినిమా ఉండేది అప్పుడే.. నాని క్లారిటీ..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేఖ, సింగ్ మధ్య గత ఏడాది కాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య అక్రమసంబంధం గురించి తెలియడంతో చంపడానికి కుట్రపన్నారని మృతుడి సోదరుడు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణ సమయంలో రేఖ పొంతనలేని సమాధానాలను చెప్పి తప్పించుకుంది, కానీ తరువాత తన భర్తకు విషం ఇచ్చినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!