UP: నలుగురు పిల్లల తల్లి ప్రియుడి కోసం.. భర్తకు టీలో ఎలుకల మందు కలిపి..
- నలుగురు పిల్లల తల్లి ప్రియుడి కోసం
- భర్తకు టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది
- 16 ఏళ్ల వివాహబంధానికి మరణశాసనం రాసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరాయి వ్యక్తులపై మోజు కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నాయి. ప్రియుడి మోజులో భర్తల ప్రాణాలు తీస్తున్నారు భార్యలు. దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో దారుణం వెలుగుచూసింది. ఉత్తర్ ప్రదేశ్ లో నలుగురు పిల్లల తల్లి ప్రియుడి కోసం భర్తకు టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. 16 ఏళ్ల వివాహబంధానికి మరణశాసనం రాసింది. అది తాగిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. భర్తకు విషమిచ్చి చంపిన భార్య హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. పోలీసులు ఆమెను ప్రియుడిని అరెస్ట్ చేశారు.
Also Read:Gurugram: ఐసీయూలో ఎయిర్ హోస్టెస్పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు
Also Read
రేఖ అనే వివాహిత కప్పు టీలో ఎలుకల మందు కలిపి తన భర్త కేహర్ సింగ్కు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె తన ప్రేమికుడు పింటును బరేలీలోని ఫతేగంజ్లోని తన ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి సింగ్ను గొంతు నులిమి చంపారు. ఆ తర్వాత వారు తాడుతో అతని బాడీని ఉరితీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. మరుసటి రోజు, రేఖ ఏడుపులతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. తన భర్త ఉరేసుకుని చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నంచేసింది.
Also Read:Kalyan Ram: ఇలాంటి సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదన్నాడు
వారు మృతదేహాన్ని కిందకు దించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం నివేదికలో గొంతు నులిమి చంపినట్లు స్పష్టంగా ఉందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (నార్త్) ముఖేష్ చంద్ర మిశ్రా తెలిపారు. బాధితురాలి సోదరుడు అశోక్ సింగ్ ఫిర్యాదు మేరకు ఆ మహిళ, ఆమె ప్రేమికుడిపై హత్య కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.
Also Read:Nani : సుజిత్ తో సినిమా ఉండేది అప్పుడే.. నాని క్లారిటీ..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేఖ, సింగ్ మధ్య గత ఏడాది కాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య అక్రమసంబంధం గురించి తెలియడంతో చంపడానికి కుట్రపన్నారని మృతుడి సోదరుడు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణ సమయంలో రేఖ పొంతనలేని సమాధానాలను చెప్పి తప్పించుకుంది, కానీ తరువాత తన భర్తకు విషం ఇచ్చినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!