UP: నలుగురు పిల్లల తల్లి ప్రియుడి కోసం.. భర్తకు టీలో ఎలుకల మందు కలిపి..
- నలుగురు పిల్లల తల్లి ప్రియుడి కోసం
- భర్తకు టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది
- 16 ఏళ్ల వివాహబంధానికి మరణశాసనం రాసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరాయి వ్యక్తులపై మోజు కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నాయి. ప్రియుడి మోజులో భర్తల ప్రాణాలు తీస్తున్నారు భార్యలు. దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో దారుణం వెలుగుచూసింది. ఉత్తర్ ప్రదేశ్ లో నలుగురు పిల్లల తల్లి ప్రియుడి కోసం భర్తకు టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. 16 ఏళ్ల వివాహబంధానికి మరణశాసనం రాసింది. అది తాగిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. భర్తకు విషమిచ్చి చంపిన భార్య హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. పోలీసులు ఆమెను ప్రియుడిని అరెస్ట్ చేశారు.
Also Read:Gurugram: ఐసీయూలో ఎయిర్ హోస్టెస్పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
రేఖ అనే వివాహిత కప్పు టీలో ఎలుకల మందు కలిపి తన భర్త కేహర్ సింగ్కు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె తన ప్రేమికుడు పింటును బరేలీలోని ఫతేగంజ్లోని తన ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి సింగ్ను గొంతు నులిమి చంపారు. ఆ తర్వాత వారు తాడుతో అతని బాడీని ఉరితీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. మరుసటి రోజు, రేఖ ఏడుపులతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. తన భర్త ఉరేసుకుని చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నంచేసింది.
Also Read:Kalyan Ram: ఇలాంటి సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదన్నాడు
వారు మృతదేహాన్ని కిందకు దించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం నివేదికలో గొంతు నులిమి చంపినట్లు స్పష్టంగా ఉందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (నార్త్) ముఖేష్ చంద్ర మిశ్రా తెలిపారు. బాధితురాలి సోదరుడు అశోక్ సింగ్ ఫిర్యాదు మేరకు ఆ మహిళ, ఆమె ప్రేమికుడిపై హత్య కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.
Also Read:Nani : సుజిత్ తో సినిమా ఉండేది అప్పుడే.. నాని క్లారిటీ..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేఖ, సింగ్ మధ్య గత ఏడాది కాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య అక్రమసంబంధం గురించి తెలియడంతో చంపడానికి కుట్రపన్నారని మృతుడి సోదరుడు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణ సమయంలో రేఖ పొంతనలేని సమాధానాలను చెప్పి తప్పించుకుంది, కానీ తరువాత తన భర్తకు విషం ఇచ్చినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!