Zia ur Rahman Barq: ఎంపీ ఇంటిపై విద్యుత్ శాఖ బృందం దాడి
- ఉత్తరప్రదేశ్ లోని సంభాల్లో
- ఎంపీ ఇంటిపై విద్యుత్ శాఖ బృందం దాడి
- భారీగా భద్రతాదళాలు మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zia ur Rahman Barq: ఉత్తరప్రదేశ్ లోని సంభాల్లో విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. విద్యుత్ మీటర్లో ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానంతో ఎంపీ జియావుర్ రెహమాన్ బుర్కే ఇంటిపై విద్యుత్ శాఖ బృందం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఎస్పీ శ్రీశ్చంద్ర, పోలీసు బలగాలు, ఆర్ఆర్ఎఫ్తో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంపీ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ కనెక్షన్లు, పరికరాలను బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. కరెంటు బిల్లు సున్నాకి ఎలా వచ్చిందో విషయంపై అధికారులు మీటర్లు తనిఖీ చేసారు. సుమారు గంటపాటు విచారణ అనంతరం బృందం తిరిగి వచ్చింది. అయితే సదరు ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ పోలీసు బలగాలు మోహరించాయి.
Also Read: Chess Dance: ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ ఆటకు తగ్గట్టుగా నాట్యం.. (వీడియో)
Also Read
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
విద్యుత్ శాఖ పాత మీటర్లను ల్యాబ్ పరీక్షలకు పంపి ఇంటి వద్ద పకడ్బందీ కేబుల్తో కూడిన స్మార్ట్ మీటర్ను అమర్చింది. ఒక మీటర్పై జీరో లోడ్ ఉండగా, మరో మీటరుపై 5.9 కిలోవాట్ల లోడ్ నమోదైందని దర్యాప్తులో తేలింది. ఇక విషయం ఏంటంటే.. SP ఎంపీ ఇంటి వద్ద రెండు కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కొక్కటి నాలుగు కిలోవాట్ల కెపాసిటీ కలిగి ఉన్నాయి. గత ఏడాది కాలంలో ఈ రెండు కనెక్షన్లపై రూ.14 వేలు మాత్రమే విద్యుత్ బిల్లు వచ్చింది. రెండు కనెక్షన్ల మీటర్లు వేర్వేరు సమయాల్లో చాలా కాలం పాటు స్విచ్ ఆఫ్లో ఉన్నాయని, దీని కారణంగా సున్నా రీడింగ్లు నమోదయ్యాయని పరిశోధనలో వెల్లడైంది. ఒక మీటరు ఐదు నెలలు, మరొకటి ఏడు నెలల పాటు స్విచ్ ఆఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: Leopard attack: చిరుతపులి దాడి.. యువతి మృతి
#WATCH | Sambhal, Uttar Pradesh: A team from State Electricity Department, along with a large number of security personnel, arrives at the residence of SP MP Zia ur Rehman Barq in Sambhal. The State Electricity Department has flagged irregularities in electricity usage at the… pic.twitter.com/Y8eLXbXf1M
— ANI (@ANI) December 19, 2024
దర్యాప్తు బృందం గంటపాటు క్షుణ్ణంగా విచారణ జరిపి అన్ని కనెక్షన్లు మరియు పరికరాలను పరీక్షించింది. విచారణ పూర్తి చేసిన అనంతరం ఎస్డిఎం డాక్టర్ వందనా మిశ్రా కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ నివేదిక ఆధారంగా విద్యుత్ శాఖ తదుపరి చర్యలు తీసుకోనుంది. అయితే, విద్యుత్ చౌర్యం కేసులో ఎంపీ జియావుర్ రెహమాన్ బుర్కే, అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మీటర్ తప్పుగా తేలితే విద్యుత్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవచ్చు. అలాగే, సోలార్ ప్యానెల్లు ఇంకా జనరేటర్ల వినియోగానికి సంబంధించి ఎంపీ అతని న్యాయవాది వివరణ ఇచ్చారు. అయితే, ఎంపీపీ ఇంటి వద్ద ఉన్న రెండు కనెక్షన్లకు అమర్చిన పరికరాలు, వినియోగం ప్రకారం ప్రతి నెలా కనీసం రూ.6వేలు బిల్లు రావాల్సి ఉందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. బిల్లులో ఇంత భారీ వ్యత్యాసం కనిపించడంతో ఆ శాఖ పాత మీటర్ను విచారణకు పంపింది. మీటర్లు తారుమారు అయ్యాయా అనేది విచారణలో తేలుతుంది. రెండు కనెక్షన్ల వినియోగంలో ఇంత వ్యత్యాసం ఎందుకు ఉందో ఇప్పుడు స్మార్ట్ మీటర్లో తనిఖీ చేయబడుతుంది. ఎంపీపీ కనెక్షన్పై ఐదు నెలలు, మరో కనెక్షన్పై ఏడు నెలలుగా జీరో యూనిట్లు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
-
Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
-
Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!