Hyderabad Metro: ఎలక్షన్ ఎఫెక్ట్.. జనాల్లేక బోసిపోయిన మెట్రో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల జరుగుతుండడంతో పండుగా వాతావరణం నెలకొంది. నగర వాసులంతా ఓట్లేసేందుకు తమ తమ సొంత గ్రామాలకు పెద్ద ఎత్తున్న తరలి వెళ్లారు. గ్రామగ్రామాన పోలింగ్ ప్రక్రియ పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రజలంతా ఓటేయడానికి గ్రామాలకు తరలి పోవడంతో హైదరాబాద్ మహానగరం బోసిపోయింది. ముఖ్యంగా రోజూ కిక్కిరిసిపోయే హైదరాబాద్ మెట్రోలో అనూహ్య పరిస్థితి నెలకొంది. నేడు ప్రయాణిస్తున్న మెట్రో ట్రైన్లు కరోనా కాలం నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,655 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 3.26 కోట్ల మంది ఓటర్లు నేడు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు నేడు దాదాపు లక్ష మంది రాష్ట్ర పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.
#METROHYDERABAD pic.twitter.com/F8ByNjHlN9
Also Read
— Sai vineeth(Journalist🇮🇳) (@SmRtysai) November 30, 2023
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..