Nitin Gadkari: రూ.1900 కోట్లతో నిర్మించిన రోడ్డుకు రూ.8000 కోట్ల టోల్ ట్యాక్స్?.. కేంద్ర మంత్రి వివరణ..
- రూ.1900 కోట్లతో నిర్మించిన రోడ్డుకు రూ.8000 కోట్ల టోల్ ట్యాక్స్?
- అధికంగా ఎందుకు వసూలు చేశారో చెప్పిన కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని మనోహర్పూర్ ప్లాజాలో ధర కంటే ఎక్కువ టోల్ ట్యాక్స్ వసూలు చేశారన్న ఆరోపణలపై కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. రూ.1900 కోట్లతో నిర్మించిన రోడ్డుపై రూ.8000 కోట్ల టోల్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేశారో, ఎలా వసూలు చేశారో ఓ న్యూస్ ఛానెల్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సవివరంగా వివరించారు. సంభాషణ సందర్భంగా, ఢిల్లీ-జైపూర్ హైవేపై టోల్ ట్యాక్స్ ఖర్చు కంటే ఎలా పెరిగిందో నితిన్ గడ్కరీ ఉదాహరణతో వివరించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిర్మాణ వ్యయం కంటే ఎక్కువ వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ ప్రశ్నకు పూర్తి గణితాన్ని వివరించారు. ఒక్కరోజులో ప్రజల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయడం లేదన్నారు. టోల్ ట్యాక్స్ వసూలుకు ముందు, తర్వాత ప్రభుత్వం అనేక రకాల ఖర్చులను ఎదుర్కోవాల్సి వస్తుందని గడ్కరీ తెలిపారు. ఇది కూడా టోల్ పెరగడానికి కారణమని వెల్లడించారు.
Also Read
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
నితిన్ గడ్కరీ ఒక ఉదాహరణ చెబుతూ.. “ఒక వ్యక్తి రూ.2.5 లక్షలతో ఇల్లు లేదా కారు కొన్నాడనుకుందాం. ఆ వ్యక్తి 10 సంవత్సరాలకు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్లయితే, కారు, ఇళ్లు ధర పెరుగుతుంది. వినియోగదారుడు ప్రతి నెలా వడ్డీ చెల్లించాలి. చాలా సార్లు అప్పులు చేసి అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. అందువల్ల బాధ్యత కూడా పెరుగుతుంది. దాని వాయిదా చెల్లింపు కూడా పెరుగుతుంది. ఇలాగే రోడ్డు వేసేందుకు అప్పులు చేసినందుకు విలువ పెరిగింది” అని వివరించారు.
READ MORE: Actor Ali : జానీ మాస్టర్ వ్యవహారంపై అలీ రియాక్షన్..
ఢిల్లీ-జైపూర్ రహదారి (జాతీయ రహదారి-8) నిర్మాణ వ్యయం కంటే ఎక్కువ టోల్ వసూలు చేయబడిన విషయంపై కేంద్ర మంత్రి స్పష్టంగా వివరించారు. ఈ రహదారిపై అధిక టోల్ తీసుకోబడిందని కేసు నడుతస్తోంది. ఈ రోడ్డును 2009లో యూపీఏ ప్రభుత్వం కేటాయించింది. అప్పట్లో 9 బ్యాంకులను ఇందులో చేర్చారు. ఈ రహదారిని నిర్మించడంలో మంత్రిత్వ శాఖ చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చిందని గడ్కరీ చెప్పారు. కాంట్రాక్టర్లు మారారని నితిన్ గడ్కరీ చెప్పారు. బ్యాంకులు కేసు పెట్టాయి. ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.
తాజావార్తలు
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
-
Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..