Telangana BJP: అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి.. పవన్ ను కోరిన తెలంగాణ బీజేపీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని జనసేన పార్టీని బీజేపీ కోరింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు పవన్ను కోరారు. అయితే ఈ విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్ వారికి చెప్పినట్లు సమాచారం.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్ చర్చలు జరిపారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఎన్.డి.ఎ.లో జనసేన కొనసాగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై సావధానంగా చర్చలు చేశారు. జనసేన నాయకుల మనోగతాన్ని పవన్ కళ్యాణ్ బి.జె.పి. నేతలకు వివరించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశామని, బీజేపీ అగ్ర నాయకుల కోరిక మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నుంచి విరమించుకుని బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశామని, ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబ్బ తింటుందని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్న విషయాన్ని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కి ..పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియచేశారు. ఉమ్మడిగా పోటీ చేసే విషయమై ఒకటి రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తన కార్యాలయానికి విచ్చేసిన బీజేపీ నేతలను పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
ఈ సందర్భంగా తెలంగాణ జనసేన నాయకులు పవన్తో మాట్లాడుతూ.. రాజకీయ గందరగోళం జరగకూడదనే ఉద్దేశ్యంతో 2018లో కొత్త రాష్ట్రంలో పోటీ చేయకూడదన్న అభిప్రాయాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చేందుకే పోటీ నుంచి తప్పుకున్నామని, అయితే ఈసారి తప్పక పోటీ చేయాలని కోరారు. చాలా రోజులుగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నామని నేతలు అభిప్రాయపడ్డారు. ఈసారి పదవీ విరమణ చేస్తే భవిష్యత్లో ప్రజల ముందుకు బలంగా వెళ్లడం కష్టమని, క్యాడర్కు నిరాశ తప్పదని స్పష్టం చేశారు. నేతల అభిప్రాయాలు విన్న పవన్ కళ్యాణ్.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తానే అర్థం చేసుకోగలనని, అయితే తనపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని, అయితే నాయకులు, ప్రజా సైనికులు, వీర వనితల అభిప్రాయాలను గౌరవిస్తానని చెప్పారు. సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఒకటి రెండు రోజులు ఆగాల్సిందేనని పవన్ చెప్పినట్లు సమాచారం.
MLA Raja Singh: నామీద పోటీచేసే దమ్ముందా..? అసదుద్దీన్ ఓవైసీ కి రాజాసింగ్ సవాల్..!
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!