S. Jaishankar: ప్రధాని ఉక్రెయిన్ పర్యటనను ‘చారిత్రాత్మకంగా’ అభివర్ణించిన కేంద్రమంత్రి..
- ఉక్రెయిన్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ
- మోడీ పర్యటనను 'చారిత్రాత్మకం' అని అభివర్ణించిన కేంద్ర విదేశాంగ మంత్రి
- ప్రధాని మోడీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాలలో భాగం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ తొలిసారి ఉక్రెయిన్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ‘చారిత్రాత్మకం’ అని అభివర్ణించారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాలలో భాగమని పేర్కొన్నారు. వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ, ఔషధాలు, వ్యవసాయం, విద్య రంగాలపై మోడీ-జెలెన్స్కీ మధ్య చర్చ జరిగినట్లు జైశంకర్ తెలిపారు. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను పునర్నిర్మించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రధాని మోడీ, జెలెన్స్కీ ఇంటర్-గవర్నమెంటల్ కమిషన్కు బాధ్యత వహించారు. ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ప్రధాన చర్చ ఉక్రెయిన్లో యుద్ధంపైనే జరిగిందని జైశంకర్ అన్నారు. శాంతిభద్రతల పునరుద్ధరణకు అన్ని విధాలా సహాయం అందించేందుకు భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు.
Nirmal Benny: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
చర్చల అనంతరం ఇరువురు నేతలు నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశారు. వ్యవసాయం, ఆహార పరిశ్రమ, వైద్యం, సంస్కృతి.. మానవతా సహాయం రంగాలలో సహకారాన్ని అందిస్తాయని అధికారులు తెలిపారు. 1991లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్కు వెళ్లడం ఇదే తొలిసారి. ఇరుపక్షాలు పరస్పర చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనాలని భారత్ విశ్వసిస్తోందని జైశంకర్ తెలిపారు.
PM Modi: ‘భారత్ ఎప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంది’.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు
మరోవైపు.. భారత్లో పర్యటించాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ప్రధాని మోడీ ఆహ్వానించారని జై శంకర్ తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన సౌలభ్యం మేరకు భారతదేశాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నట్లు జై శంకర్ పేర్కొన్నారు. రష్యాపై విధించిన ఆంక్షలకు సంబంధించి.. భారత్ సాధారణంగా ఏ దేశంపైనా ఆంక్షలు విధించదని చెప్పారు. ఇది మన రాజకీయ, దౌత్య సంప్రదాయంలో భాగం కాదని.. తాము సాధారణంగా UN ఆంక్షలకు కట్టుబడి ఉంటామని కేంద్రమంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!