S. Jaishankar: ప్రధాని ఉక్రెయిన్ పర్యటనను ‘చారిత్రాత్మకంగా’ అభివర్ణించిన కేంద్రమంత్రి..
- ఉక్రెయిన్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ
- మోడీ పర్యటనను 'చారిత్రాత్మకం' అని అభివర్ణించిన కేంద్ర విదేశాంగ మంత్రి
- ప్రధాని మోడీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాలలో భాగం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ తొలిసారి ఉక్రెయిన్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ‘చారిత్రాత్మకం’ అని అభివర్ణించారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాలలో భాగమని పేర్కొన్నారు. వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ, ఔషధాలు, వ్యవసాయం, విద్య రంగాలపై మోడీ-జెలెన్స్కీ మధ్య చర్చ జరిగినట్లు జైశంకర్ తెలిపారు. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను పునర్నిర్మించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రధాని మోడీ, జెలెన్స్కీ ఇంటర్-గవర్నమెంటల్ కమిషన్కు బాధ్యత వహించారు. ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ప్రధాన చర్చ ఉక్రెయిన్లో యుద్ధంపైనే జరిగిందని జైశంకర్ అన్నారు. శాంతిభద్రతల పునరుద్ధరణకు అన్ని విధాలా సహాయం అందించేందుకు భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు.
Nirmal Benny: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి
Also Read
- Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
- KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
- Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
- 1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
చర్చల అనంతరం ఇరువురు నేతలు నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశారు. వ్యవసాయం, ఆహార పరిశ్రమ, వైద్యం, సంస్కృతి.. మానవతా సహాయం రంగాలలో సహకారాన్ని అందిస్తాయని అధికారులు తెలిపారు. 1991లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్కు వెళ్లడం ఇదే తొలిసారి. ఇరుపక్షాలు పరస్పర చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనాలని భారత్ విశ్వసిస్తోందని జైశంకర్ తెలిపారు.
PM Modi: ‘భారత్ ఎప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంది’.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు
మరోవైపు.. భారత్లో పర్యటించాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ప్రధాని మోడీ ఆహ్వానించారని జై శంకర్ తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన సౌలభ్యం మేరకు భారతదేశాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నట్లు జై శంకర్ పేర్కొన్నారు. రష్యాపై విధించిన ఆంక్షలకు సంబంధించి.. భారత్ సాధారణంగా ఏ దేశంపైనా ఆంక్షలు విధించదని చెప్పారు. ఇది మన రాజకీయ, దౌత్య సంప్రదాయంలో భాగం కాదని.. తాము సాధారణంగా UN ఆంక్షలకు కట్టుబడి ఉంటామని కేంద్రమంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!