S. Jaishankar: ప్రధాని ఉక్రెయిన్ పర్యటనను ‘చారిత్రాత్మకంగా’ అభివర్ణించిన కేంద్రమంత్రి..
- ఉక్రెయిన్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ
- మోడీ పర్యటనను 'చారిత్రాత్మకం' అని అభివర్ణించిన కేంద్ర విదేశాంగ మంత్రి
- ప్రధాని మోడీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాలలో భాగం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ తొలిసారి ఉక్రెయిన్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ‘చారిత్రాత్మకం’ అని అభివర్ణించారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాలలో భాగమని పేర్కొన్నారు. వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ, ఔషధాలు, వ్యవసాయం, విద్య రంగాలపై మోడీ-జెలెన్స్కీ మధ్య చర్చ జరిగినట్లు జైశంకర్ తెలిపారు. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను పునర్నిర్మించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రధాని మోడీ, జెలెన్స్కీ ఇంటర్-గవర్నమెంటల్ కమిషన్కు బాధ్యత వహించారు. ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ప్రధాన చర్చ ఉక్రెయిన్లో యుద్ధంపైనే జరిగిందని జైశంకర్ అన్నారు. శాంతిభద్రతల పునరుద్ధరణకు అన్ని విధాలా సహాయం అందించేందుకు భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు.
Nirmal Benny: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి
Also Read
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
చర్చల అనంతరం ఇరువురు నేతలు నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశారు. వ్యవసాయం, ఆహార పరిశ్రమ, వైద్యం, సంస్కృతి.. మానవతా సహాయం రంగాలలో సహకారాన్ని అందిస్తాయని అధికారులు తెలిపారు. 1991లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్కు వెళ్లడం ఇదే తొలిసారి. ఇరుపక్షాలు పరస్పర చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనాలని భారత్ విశ్వసిస్తోందని జైశంకర్ తెలిపారు.
PM Modi: ‘భారత్ ఎప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంది’.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు
మరోవైపు.. భారత్లో పర్యటించాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ప్రధాని మోడీ ఆహ్వానించారని జై శంకర్ తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన సౌలభ్యం మేరకు భారతదేశాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నట్లు జై శంకర్ పేర్కొన్నారు. రష్యాపై విధించిన ఆంక్షలకు సంబంధించి.. భారత్ సాధారణంగా ఏ దేశంపైనా ఆంక్షలు విధించదని చెప్పారు. ఇది మన రాజకీయ, దౌత్య సంప్రదాయంలో భాగం కాదని.. తాము సాధారణంగా UN ఆంక్షలకు కట్టుబడి ఉంటామని కేంద్రమంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
-
Rajnikanth : రజనీ అనేవాడు అలంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పడు చేయను
-
Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..