S. Jaishankar: ప్రధాని ఉక్రెయిన్ పర్యటనను ‘చారిత్రాత్మకంగా’ అభివర్ణించిన కేంద్రమంత్రి..
- ఉక్రెయిన్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ
- మోడీ పర్యటనను 'చారిత్రాత్మకం' అని అభివర్ణించిన కేంద్ర విదేశాంగ మంత్రి
- ప్రధాని మోడీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాలలో భాగం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ తొలిసారి ఉక్రెయిన్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ‘చారిత్రాత్మకం’ అని అభివర్ణించారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాలలో భాగమని పేర్కొన్నారు. వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ, ఔషధాలు, వ్యవసాయం, విద్య రంగాలపై మోడీ-జెలెన్స్కీ మధ్య చర్చ జరిగినట్లు జైశంకర్ తెలిపారు. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను పునర్నిర్మించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రధాని మోడీ, జెలెన్స్కీ ఇంటర్-గవర్నమెంటల్ కమిషన్కు బాధ్యత వహించారు. ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ప్రధాన చర్చ ఉక్రెయిన్లో యుద్ధంపైనే జరిగిందని జైశంకర్ అన్నారు. శాంతిభద్రతల పునరుద్ధరణకు అన్ని విధాలా సహాయం అందించేందుకు భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు.
Nirmal Benny: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి
Also Read
చర్చల అనంతరం ఇరువురు నేతలు నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశారు. వ్యవసాయం, ఆహార పరిశ్రమ, వైద్యం, సంస్కృతి.. మానవతా సహాయం రంగాలలో సహకారాన్ని అందిస్తాయని అధికారులు తెలిపారు. 1991లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్కు వెళ్లడం ఇదే తొలిసారి. ఇరుపక్షాలు పరస్పర చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనాలని భారత్ విశ్వసిస్తోందని జైశంకర్ తెలిపారు.
PM Modi: ‘భారత్ ఎప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంది’.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు
మరోవైపు.. భారత్లో పర్యటించాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ప్రధాని మోడీ ఆహ్వానించారని జై శంకర్ తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన సౌలభ్యం మేరకు భారతదేశాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నట్లు జై శంకర్ పేర్కొన్నారు. రష్యాపై విధించిన ఆంక్షలకు సంబంధించి.. భారత్ సాధారణంగా ఏ దేశంపైనా ఆంక్షలు విధించదని చెప్పారు. ఇది మన రాజకీయ, దౌత్య సంప్రదాయంలో భాగం కాదని.. తాము సాధారణంగా UN ఆంక్షలకు కట్టుబడి ఉంటామని కేంద్రమంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. ‘వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు’!
-
HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
-
HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!