Bandi Sanjay: వందే భారత్ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. నేటి నుంచి మంచిర్యాలలో హాల్టింగ్..
- వందే భారత్ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
- నేటి నుంచి మంచిర్యాలలో హాల్టింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మంచిర్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు. బండి సంజయ్ తోపాటు జెండా ఊపిన రాష్ట్ర మంత్రి జి.వివేక్, ఎంపీ గడ్డం వంశీక్రిష్ణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి. వందేభారత్ రైలు ప్రారంభం సందర్భంగా కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. మంచిర్యాలలో నేటి నుండి ‘‘వందే భారత్’’ హాల్టింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. జై బీజేపీ, జై బండి సంజయ్ నినాదాలతో మారుమోగిన మంచిర్యాల రైల్వే స్టేషన్.. కార్యకర్తల నినాదాలతో గందరగోళం ఏర్పడింది.
Also Read
దీంతో ఇట్లా నినాదాలు, గొడవలు చేసి డిస్ట్రబ్ చేస్తే ఒక్క అభివృద్ధి పని కూడా రాదనే సంగతి గుర్తుంచుకోవాలంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. నినాదాలు చేస్తుంటే వారించారు. కొట్లాటలు కావాలా..అభివృద్ధి కావాలా.. కాంగ్రెస్, బిజెపి ఏ పార్టీ వాళ్లు అయినా నినాదాలు చేయవద్దు.. నినాదాలు చేస్తే కార్యక్రమం నుంచి వెళ్ళిపోతానని కార్యకర్తలతో బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో సద్దుమణిగిన నినాదాలు..
Also Read:Tragedy: గుండ్ల పోచంపల్లిలో విషాదం.. ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు..
బండి సంజయ్ సహకారంతోనే మంచిర్యాలలో వందే భారత్ రైలు హాల్టింగ్ వచ్చిందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. మంచిర్యాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక ప్రజలు అల్లాడుతున్నారని అంజిరెడ్డి తెలిపారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మంజూరు చేయాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులను కోరారు. కేరళ ఎక్స్ప్రెస్ మంచిర్యాల లో స్టాప్ ఉండాలని బండి సంజయ్ ని మంత్రి వివేక్ కోరారు. శబరిమలకు వెళ్ళే భక్తుల ఇబ్బందులు తొలగించాలని కోరారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!