Smriti Irani: అమేథీ నుంచి స్మృతి ఇరానీ నామినేషన్ దాఖలు.. కాంగ్రెస్ నుంచి ప్రత్యర్థి ఎవరో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమేథీ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను కేంద్రమంత్రి సమర్పించారు. స్మృతి ఇరానీ వెంట మధ్యప్రదశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇక అమేథీలో ఐదో విడతలో పోలింగ్ జరగనుంది. అనగా మే 20న ఇక్కడ ఓటింగ్ జరగనుంది. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో అమేథీ నుంచి స్మృతి ఇరానీ భారీ విజయం సాధించారు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీపై 55 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తిరిగి ఇదే స్థానం నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు.
ఇది కూడా చదవండి: Namburu Sankara Rao: మంచిని చూడండి.. మనసారా ఆశీర్వదించండి: నంబూరు శంకరరావు
Also Read
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
ఇదిలా ఉంటే అమేథీ మొదట నుంచి కాంగ్రెస్కు కంచుకోటలాంటిది. అలాంటిది 2019 ఎన్నికల్లో ఇక్కడ రాహుల్ గాంధీ పరాజయం చూడాల్సి వచ్చింది. స్మృతి ఇరానీ చేతిలో ఘోర ఓటమి చెందారు. కానీ కేరళలోని వయనాడ్ నుంచి మాత్రం రాహుల్ గెలిపొందారు. ఈసారి కూడా అక్కడే నామినేషన్ వేశారు. అలాగే అమేథీలో కూడా రాహులే పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు శనివారం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమై.. రాయ్బరేలీ, అమేథీ అభ్యర్థుల ఎంపిక నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించారు.
ఇది కూడా చదవండి: Beetroot Benefits : బీట్ రూట్ జ్యూస్ ను ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
నామినేషన్ దాఖలు చేసిన తర్వాత స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. మేథీలో గత 5 సంవత్సరాలలో 1,14,000 ఇళ్ళు నిర్మించబడ్డాయని తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 1.5 లక్షల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు అందాయని వెల్లడించారు. అలాగే 4 లక్షల మందికి పైగా రైతులు ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధిని అందుకున్నారని చెప్పారు. అందుకోసమే ప్రజలు ప్రధాని మోడీని, బీజేపీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె తెలిపారు.
తాజావార్తలు
-
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!