Amit Shah Visit To Moreh: భారత- మయన్మార్ సరిహద్దులో అమిత్షా.. మోరేలో పర్యటన..
Amit Shah Visit To Moreh: మణిపూర్లో చెలరేగిన ఘర్షణలను కట్టడి చేసి.. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. గత రెండు రోజుల నుంచి పలు సంఘాలు, జాతుల నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ప్రత్యేకంగా రాష్ర్ట మంత్రివర్గ సమావేశంలో కూడా హోం మంత్రి పాల్గొన్నారు. సంఘాలు, జాతులతో నిర్వహించిన సమావేశాల సారాంశాలను రాష్ర్ట ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి రాష్ట్రంలో శాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 3వ రోజు పర్యటన సందర్భంగా భారత- మయన్మార్ సరిహద్దులో ఉన్న మోరేన్ పట్టణంలో అమిత్ పర్యటించనున్నారు. అక్కడ ఉండే కుకీలు.. కుకీ సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
సోమవారం అర్థరాత్రి ఇంఫాల్కు చేరుకున్న తర్వాత అమిత్ షా వివిధ కుకీ మరియు మెయిటీ నాయకులు, ఉన్నత భద్రతా అధికారులు మరియు మణిపూర్ క్యాబినెట్తో జాతి హింసకు పరిష్కారం కోసం వరుస సమావేశాలను నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం మంగళవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఘర్షణల మూలంగా మోరేన్ పట్టణం ఎక్కు్వగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో అమిత్ షా నేడు మోరేన్లో పర్యటించనున్నారు. అక్కడ కుకీ పౌర సమాజ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో కాంగ్పోక్పి జిల్లాకు వెళ్తారు. ఇది కుకీలు అధికంగా ఉండే ప్రాంతం. అక్కడ అనేక మెయిటీ గ్రామాలు కూడా ఉన్నాయి. రెండు వర్గాల మతపరమైన నిర్మాణాలు మరియు భవనాలు లక్ష్యంగా చేసుకున్న ఘర్షణల కారణంగా ఎక్కువగా ప్రభావితమైన జిల్లాల్లో కాంగ్పోక్పి ఒకటి.
Also Read
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్రూట్ పులావ్ తయారు చేయండిలా..
- CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాష్ర్టంలో అమిత్ షా పర్యటన కొనసాగుతున్నప్పటికీ ..కక్చింగ్ జిల్లాలోని సుగ్నులో తిరుగుబాటుదారులు మరియు భద్రతా దళాల మధ్య గత రాత్రి కాల్పులు జరిగినట్లు అధికారులు నివేదించారు. ఇంఫాల్ తూర్పులోని సగోల్మాంగ్లో జరిగిన ప్రత్యేక దాడిలో కొందరు పౌరులు గాయపడ్డారు. అమిత్ షాతో పాటు హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్ దేకా ఉన్నారు. రాష్ట్రంలో తక్షణమే సాధారణ స్థితిని పునరుద్ధరించే లక్ష్యంతో ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శాంతి భద్రతల మెరుగుదల, వేగవంతమైన సహాయక చర్యలు, హింసలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం మరియు పుకార్ల వ్యాప్తిని ఎదుర్కోవడానికి కమ్యూనికేషన్ మార్గాలను తిరిగి తెరవడం వంటివి ఇందులో ఉన్నాయి. రాష్ట్రంలో జరిగిన హింసపై సీబీఐ విచారణకు హామీ ఇస్తూ, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
-
IPL Rules: బౌలర్లకు న్యాయం కావాలి.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి!
-
Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
-
Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్రూట్ పులావ్ తయారు చేయండిలా..
-
Kadiyam Srihari: కేసీఆర్పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!