Site icon NTV Telugu

Union Budget 2026: పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి ‘కొత్త ఐటీ చట్టం’!

Union Budget 2026 (1)

Union Budget 2026 (1)

Union Budget 2026: మధ్యతరగతి ప్రజలకు, చిన్న తరహా పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026లో కీలక ప్రకటనలు చేశారు. దశాబ్దాల కాలం నాటి పన్ను నిబంధనలను పక్కన పెట్టి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ‘కొత్త ఆదాయపు పన్ను చట్టం – 2025’ను ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.

Ram Charan: ‘ఇంత ఆనందంలో మాటలు రావడం లేదు’.. రామ్ చరణ్ భావోద్వేగం!

కొత్త చట్టం ద్వారా పన్ను ప్రక్రియను మరింత సరళతరం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా ప్రకటించిన అంశాల విషయానికి వస్తే.. విద్య, వైద్య సేవలపై అలాగే విదేశీ టూర్ ప్యాకేజీలపై ఉన్న TCS (Tax Collected at Source) ను 5% నుంచి 2 శాతానికి తగ్గించారు. ఇది విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు, చికిత్స పొందే వారికి పెద్ద ఊరట కానుంది.

అలాగే సవరించిన పన్ను రిటర్నుల (Revised Returns) దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించారు. ఇంకా చిన్న తరహా ఆదాయపన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేకంగా 6 నెలల పాటు ఊరటనిచ్చే పథకాన్ని కూడా ప్రకటించారు మంత్రి. ముఖ్యంగా రహదారి ప్రమాదాల వల్ల వచ్చే పరిహారంపై వడ్డీకి పన్ను మినహాయింపు ఇచ్చారు.

Sreeleela :పెళ్ళాన్ని అడిగినట్టు అడిగారు!.. అబ్బాయిల డిమాండ్‌పై శ్రీలీల క్రేజీ పంచ్!

ఇవి ఇలా ఉండగా.. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ఇకపై మరింత సులభం కానుంది. సామాన్యులు కూడా సొంతంగా ఫైల్ చేసేలా సరళతరమైన ఫారాలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి అన్నారు. ఇందులో భాగంగా ITR-1, ITR-2 ఫారాలు జులై 31 వరకు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఇంకామ్యాన్ పవర్ సరఫరా చేసే సంస్థలపై TDSను 1 లేదా 2 శాతానికి పరిమితం చేశారు మంత్రి.

విదేశాల్లో ఆస్తులు కలిగి ఉండి, వాటిని వెల్లడించని వారి కోసం ప్రభుత్వం ‘వన్ టైమ్ స్కీమ్’ను ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఎటువంటి జరిమానాలు లేకుండా విదేశీ ఆస్తులను వెల్లడించే అవకాశం కల్పించింది కేంద్రం.

Exit mobile version