Ram Charan: ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. శనివారం రాత్రి హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో ఉపాసన కవలలకు జన్మనిచ్చారు. ఒక మగ శిశువు, ఒక ఆడ శిశువు పుట్టడంతో కొణిదెల కుటుంబం, కామినేని కుటుంబం మొత్తం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. దీనితో మెగా అభిమానులు ‘వారసుడొచ్చాడు అంటూ’ సంబరాలు చేసుకుంటున్నారు.
Chiranjeevi: రామ్చరణ్- ఉపాసనకు కవలలు.. మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు!
కవలల జననం తర్వాత మీడియాతో మాట్లాడిన రామ్ చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఆనంద క్షణాల్లో మాటలు రావడం లేదంటూ తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఇంతకన్నా ఆనందమైన మూమెంట్స్ మధ్య నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. బట్ థాంక్యూ సో మచ్.. మీ అందరి ప్రేమకు, అభిమానానికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు అని అన్నారు. మీ అందరి బ్లెస్సింగ్స్ మా పిల్లలకు ఉండాలని కోరుకుంటున్నానని. ప్రత్యేకంగా ఇంతమంది వచ్చి శుభాకాంక్షలు తెలిపిన వారికి, మా మీడియా మిత్రులందరికీ థాంక్యూ సో మచ్ అంటూ రామ్ చరణ్ మాట్లాడారు.
కవలలకు పేరు ఎప్పుడు పెడతారనే ప్రశ్నకు రామ్ చరణ్ స్పందిస్తూ.. “సాంప్రదాయాల గురించి నాకు అంతగా తెలియదు. పేరు సాధారణంగా 12వ రోజు లేదా 13వ రోజు పెడతారంట. కొంతమంది 21వ రోజున కూడా పెడతారని చెప్పారు. కాబట్టి ఆ రోజు వరకు వెయిట్ చేద్దాం. ఆ రోజే నేనే అందరికీ చెప్తాను అంటూ స్పష్టత ఇచ్చారు. ఇక తండ్రిగా మొదటిసారి పిల్లలను చేతుల్లోకి తీసుకున్న అనుభూతి గురించి మాట్లాడుతూ.. “ఇది మాటల్లో చెప్పలేని ఫీలింగ్. ఏ నాన్నైనా తన బిడ్డను చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతాడో అదే అనుభూతి అని.. ఎక్కువ చెప్తే స్క్రిప్ట్లా అనిపిస్తుంది” అంటూ మాట్లాడారు.
Union Budget 2026: చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు బిగ్రిలీఫ్.. రూ.10 వేల కోట్లతో ప్రత్యేక గ్రోత్ ఫండ్
ఇంకా చరణ్ మాట్లాడుతూ.. “మేమంతా చాలా సంవత్సరాలుగా ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. దేవుడు అనుకున్న సమయానికే మాకు ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చారన్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని రామ్ చరణ్ తెలిపారు. పిల్లలు తనలాగే ఉన్నారా అన్న ప్రశ్నకు సరదాగా స్పందిస్తూ.. “కచ్చితంగా నాలాగే ఉన్నారు” అంటూ ఫన్నీగా మాట్లాడారు.