Union Budget 2026: పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి ‘కొత్త ఐటీ చట్టం’!
- ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం – 2025 అమల్లోకి
- పన్ను ప్రక్రియను మరింత సరళతరం చేయడమే లక్ష్యం
- విద్య, వైద్యం, విదేశీ టూర్ ప్యాకేజీలపై TCS 5% నుంచి 2%కి తగ్గింపు
- సవరించిన రిటర్నుల గడువు డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగింపు
- చిన్న పన్ను చెల్లింపుదారులకు 6 నెలల ప్రత్యేక ఊరట పథకం
- రహదారి ప్రమాద పరిహారంపై వడ్డీకి పన్ను మినహాయింపు
- సామాన్యులు సొంతంగా ఫైల్ చేసేలా సులభమైన ITR ఫారాలు
- ITR-1, ITR-2 ఫారాలు జూలై 31 వరకు అందుబాటులో
- మాన్పవర్ సరఫరా సంస్థలపై TDS 1–2%కి పరిమితం
- విదేశీ ఆస్తులు వెల్లడించేందుకు వన్ టైమ్ స్కీమ్ జరిమానా లేకుండా అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2026: మధ్యతరగతి ప్రజలకు, చిన్న తరహా పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026లో కీలక ప్రకటనలు చేశారు. దశాబ్దాల కాలం నాటి పన్ను నిబంధనలను పక్కన పెట్టి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ‘కొత్త ఆదాయపు పన్ను చట్టం – 2025’ను ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.
Ram Charan: ‘ఇంత ఆనందంలో మాటలు రావడం లేదు’.. రామ్ చరణ్ భావోద్వేగం!
Also Read
కొత్త చట్టం ద్వారా పన్ను ప్రక్రియను మరింత సరళతరం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా ప్రకటించిన అంశాల విషయానికి వస్తే.. విద్య, వైద్య సేవలపై అలాగే విదేశీ టూర్ ప్యాకేజీలపై ఉన్న TCS (Tax Collected at Source) ను 5% నుంచి 2 శాతానికి తగ్గించారు. ఇది విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు, చికిత్స పొందే వారికి పెద్ద ఊరట కానుంది.
అలాగే సవరించిన పన్ను రిటర్నుల (Revised Returns) దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించారు. ఇంకా చిన్న తరహా ఆదాయపన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేకంగా 6 నెలల పాటు ఊరటనిచ్చే పథకాన్ని కూడా ప్రకటించారు మంత్రి. ముఖ్యంగా రహదారి ప్రమాదాల వల్ల వచ్చే పరిహారంపై వడ్డీకి పన్ను మినహాయింపు ఇచ్చారు.
Sreeleela :పెళ్ళాన్ని అడిగినట్టు అడిగారు!.. అబ్బాయిల డిమాండ్పై శ్రీలీల క్రేజీ పంచ్!
ఇవి ఇలా ఉండగా.. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ఇకపై మరింత సులభం కానుంది. సామాన్యులు కూడా సొంతంగా ఫైల్ చేసేలా సరళతరమైన ఫారాలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి అన్నారు. ఇందులో భాగంగా ITR-1, ITR-2 ఫారాలు జులై 31 వరకు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఇంకామ్యాన్ పవర్ సరఫరా చేసే సంస్థలపై TDSను 1 లేదా 2 శాతానికి పరిమితం చేశారు మంత్రి.
విదేశాల్లో ఆస్తులు కలిగి ఉండి, వాటిని వెల్లడించని వారి కోసం ప్రభుత్వం ‘వన్ టైమ్ స్కీమ్’ను ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఎటువంటి జరిమానాలు లేకుండా విదేశీ ఆస్తులను వెల్లడించే అవకాశం కల్పించింది కేంద్రం.
తాజావార్తలు
-
Cooking Hacks: ఇల్లాళ్లకు స్మార్ట్ హెల్ప్.. ఈ వంటింటి చిట్కాలు తెలిస్తే మీ పనులు నిమిషాల్లో అయిపోతాయి!
-
IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
-
Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్పై ట్రంప్ సంచలన ఆరోపణలు
-
US-Iran: జెనీవా వేదికగా ఇరాన్-యూఎస్ శాంతి ఒప్పందం! ఎప్పుడంటే..!
-
Ragi Semiya Puttu: రాగులతో ఇలాంటి స్నాక్ ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ అద్భుతం, ఆరోగ్యం గ్యారెంటీ!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!