Immigration Scam: వామ్మో ఆమెకు 15 మంది భర్తలు.. ఈ పాపం ఆమెకే తెలియదంటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Immigration Scam: ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఆమెకు ఏకంగా 15 మంది భర్తలు ఉన్నారనే విషయం సంచలనం సృష్టించింది. ఇది నిజంగా మాములు విషయం కాదు. ఇక్కడ విశేషం ఏమిటంటే తనకు అంత మంది భర్తలు ఉన్నట్లు ఆమెకే తెలియదు. ఇది నిజం అండీ బాబు.. ఆమె ఏమో ఇంగ్లాండ్లో ఉంటుంది.. తన భర్తలు అని చెప్పుకొని 15 మంది ఇంగ్లాండ్కు వచ్చారు. అసలైన భర్త రావడానికి ప్రయత్నించినప్పుడు దొంగ భర్తల విషయం బయటపడింది. విషయం ఇంగ్లాండ్లో బయటికి రావడంతో ఆమెను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఈ కథ ఏంటి, ఏం జరిగింది.. ఈ దొంగ భర్తలు ఎవరూ.. ఆమెకు వాళ్లకు ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Racism : ఆస్ట్రేలియాలో రెచ్చిపోతున్న రేసిజం.. ఇండియన్సే టార్గెట్..
Also Read
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
- IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
- Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
బాబోయ్ దొంగ భర్తలు..
అలంపూర్కు చెందిన భిందర్ సింగ్ భార్య ఇంగ్లాండ్లో ఉంటుంది. ఈక్రమంలో భిందర్ సింగ్ తన కొడుకుతో కలిసి ఇంగ్లాండ్ వెళ్లాల్సి వచ్చింది. దానికి తన భార్య స్పాన్సర్షిప్ కూడా పంపింది. దాంతో మనోడు ఇంగ్లాండ్ వెళ్లడానికి ఇమ్మిగ్రేషన్ కంపెనీ నడుపుతున్న ప్రశాంత్, ఆయన భార్య రూబీ దగ్గరకు వెళ్లాడు. వాళ్లు మనోడి నుంచి దరఖాస్తు చేసినందుకు రూ.5.90 లక్షలు వసూలు చేశారు. మొత్తానికి అప్లై చేశామని చెప్పారు.. ఎన్నేళ్లు అయినా ఎంతకూ ఇంగ్లాండ్కు వెళ్లడానికి భిందర్ సింగ్ వీసా ఇవ్వడం లేదు.
ఇంగ్లాండ్లో వెలుగులోకి వచ్చిన మోసం..
ఇదే సమయంలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఇంగ్లాండ్లో తన భార్యను అరెస్టు చేశారని భిందర్ సింగ్కు మెసేజ్ వచ్చింది. తన పత్రాలను దుర్వినియోగం చేసి 15 మంది యువకులను తన భార్యకు భర్తలుగా మార్చి విదేశాలకు పంపారని భిందర్కు తెలిసింది. పాపం ఈ ఘటనకు సంబంధించి తన భార్యకు ఏ పాపం తెలియదని భిందర్ సింగ్ చెప్పారు. దీనికి పాల్పడింది ఇమ్మిగ్రేషన్ కంపెనీ నిర్వాహకులు ప్రశాంత్, ఆయన భార్య రూబీగా గుర్తించారు. వెంటనే బాధితుడి ఫిర్యాదు మేరకు వారిద్దరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
READ ALSO: CM Revanth Reddy: గత పాలనలో రెవెన్యూ ఉద్యోగులపై దోపిడీదారులనే ముద్ర వేశారు: సీఎం రేవంత్ రెడ్డి
తాజావార్తలు
-
KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
-
IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
-
Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
-
Suriya : టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఐదు రూపాయల డాక్టర్ బయోపిక్లో సూర్య..
-
Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!